చైనా నావికా సిబ్బందిలో మానసిక సమస్యలు
చైనా నావికా సిబ్బంది మానసిక స్థితి సరిగా లేనట్టు ఇలీవలి ఓ పరిశోధనలో వెల్లడైంది.
బీజింగ్: చైనా నావికా సిబ్బంది మానసిక స్థితి సరిగా లేనట్లు ఇలీవలి ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ దేశంలో తొలిసారిగా నిర్వహించిన ఓ మానసిక అధ్యయనంలో.. దక్షిణ చైనా సముద్ర జలాల్లో మోహరించిన జలాంతర్గాముల్లో పనిచేస్తున్న నావికా సిబ్బందిలో ఐదింట ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది.
పరిస్థితి మరింత తీవ్రం..
దక్షిణ చైనా సముద్రంపై దృష్టి కేంద్రీకరించిన డ్రాగన్.. అక్కడికి రక్షణ దళాలను తరలిస్తోంది. ఆ సముద్రంలో 1.3 మిలియన్ చదరపు మైళ్ల మేర ప్రాంతం తమకే చెందుతుందని అంటోంది. బ్రునై, మలేషియా, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం తదితర దేశాలకు సంబంధించిన సముద్ర జలాల్లో.. మిలిటరీ కార్యకలాపాల నిర్వహణ కోసం కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. అంతేకాకుండా అటువైపు ప్రయాణించే అమెరికా నౌకలతో కయ్యానికి కాలుదువ్వడమే పనిగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో షాంఘైకి చెందిన నేవల్ మెడికల్ యూనివర్సిటీ.. 500 మంది నావికా సిబ్బంది, అధికారులపై తొలిసారిగా ఓ మానసిక అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా స్వీయ అంచనా చేసుకోగలిగే ప్రశ్నావళిని వారికి ఇచ్చి, సమాధానాలు రాబట్టారు. వీరిలో 21 శాతం ఎంతో కొంత స్థాయిలో మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడైందని హాంకాంగ్కు చెందిన ఓ మీడియా సంస్థ తెలిపింది. అంతేకాకుండా భవిష్యత్తులో వారి మానసిక సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని కూడా వెల్లడించింది.
కారణాలివేనా..
దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ తన కార్యకలాపాలను తీవ్రం చేసిన నేపథ్యంలో.. సదరు నావికులు వరుసగా 60 నుంచి 90 రోజుల పాటు జలాంతర్గాముల్లోనే ఉండాల్సి రావటంతో ఈ పరిణామం చోటుచేసుకుందని ఓ అంచనా. ఈ విధంగా వారు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, పరిమిత ప్రదేశంలో, ఏకాంతంగా చాలా ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. అంతేకాకుండా, జలాంతర్గాముల్లో సంభవించే రణగొణ ధ్వనిలోనే నిద్రించాల్సి రావటం కూడా ఈ పరిస్థితికి దారితీసి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు గల నిర్దిష్ట కారణాలు తెలుసుకొనేందుకు మరిన్ని పరిశోధలు జరగాల్సి ఉందని వారు తెలిపారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!