Terrorist Attack: మార్కెట్‌లో గ్రెనేడ్‌ దాడి.. ఒకరి మృతి, 24 మందికి గాయాలు

ఉగ్రదాడితో జమ్ముకశ్మీర్‌ మరోసారి ఉలిక్కిపడింది. శ్రీనగర్‌లో రద్దీగా ఉండే ఆదివారం మార్కెట్‌పై గ్రెనేడ్‌ దాడి జరిగింది.......

Published : 07 Mar 2022 01:19 IST

శ్రీనగర్‌: ఉగ్రదాడితో జమ్ముకశ్మీర్‌ మరోసారి ఉలిక్కిపడింది. శ్రీనగర్‌లో రద్దీగా ఉండే ఆదివారం మార్కెట్‌పై గ్రెనేడ్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పౌరుడు మృతిచెందగా.. 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. హరిసింగ్‌ హైస్ట్రీట్‌ వద్ద కాపలా కాస్తున్న పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. కాగా దాడిలో అధికంగా సామాన్య పౌరులే బాధితులుగా మారినట్లు తెలిపారు. క్షతగాత్రులను మహారాజా హరిసింగ్‌ ఆసుపత్రికి తరలించామని, ఓ పోలీసు, మరో బాలిక పరిస్థితి విషయంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కట్టడిముట్టడి నిర్వహించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా దిగ్భాంతి వ్యక్తం చేశారు. ‘  దుర్మార్గమైన దాడి అంటూ ఖండించారు. ‘ఈ శోచనీయమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని