భారత్..తొలి కొవిడ్ మరణానికి ఏడాది!
భారత్లో తొలి కరోనా మరణం సంభవించి ఏడాది కాగా, ఇప్పటివరకు దాదాపు లక్షా 58వేల మంది కరోనా వల్ల మరణించారు.
దిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన విషయం తెలిసిందే. ఇది వెలుగుచూసి ఏడాది దాటినప్పటికీ.. కొన్ని దేశాల్లో వైరస్ ఉద్ధృతి ఇప్పటికీ నియంత్రణలోకి రావడం లేదు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 11కోట్ల మందిలో వైరస్ బయటపడగా, వీరిలో 26లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో తొలి కరోనా మరణం సంభవించి ఏడాది కాగా, ఇప్పటివరకు దాదాపు లక్షా 58వేల మంది కరోనా వల్ల మరణించారు.
జనవరి 30న తొలి కరోనా కేసు..
భారత్లో తొలి కరోనా కేసు జనవరి 30, 2020నాడు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వుహాన్లో విద్యను అభ్యసిస్తోన్న కేరళకు చెందిన విద్యార్థిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రక్తనమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్లో పరీక్షలు జరపగా, ఫలితం పాజిటివ్గా తేలింది. దీన్నే దేశంలో తొలి కరోనా వైరస్ కేసుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తొలి కరోనా మరణం మార్చిలో..
గతేడాది జనవరిలోనే కరోనా వైరస్ వెలుగు చూసినప్పటికీ, కొవిడ్ మరణం మాత్రం మార్చి నెలలో నమోదయ్యింది. కర్ణాటకలోని కలబురగికి చెందిన ఓ వృద్ధుడిలో మార్చి 9న కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతడిని తొలుత కలబురగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ రక్తనమూనాలను సేకరించి బెంగళూరులోని ల్యాబ్కు పంపించారు. ఈ సమయంలోనే వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం అదేరోజు తిరిగి కలబురగిలోని తన సొంత గ్రామానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే (మార్చి 10వ తేదీన) ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల తర్వాత వైద్య పరీక్షల్లో అతనికి కొవిడ్-19 ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన కేంద్ర ప్రభుత్వం, దేశంలో తొలి కరోనా మరణంగా మార్చి 12న అధికారికంగా ప్రకటించింది. అయితే, కొవిడ్తో మరణించిన వ్యక్తి అంతకుముందు సౌదీ అరేబియా నుంచి భారత్కు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా అప్పటినుంచి గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించిన వైరస్, కోటీ 11లక్షల మందిలో బయటపడింది. వైరస్ సోకినవారిలో లక్షా 58వేల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది.
జనవరి 16న వ్యాక్సినేషన్..
ప్రపంచంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, కరోనా కేసుల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. కొవిడ్ మరణాల్లో ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు ఇక్కడ తక్కువగానే ఉంది. ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. దీంతో సాధ్యమైనంత వరకు వైరస్ వ్యాప్తిని అట్టుకోవడం ద్వారా ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనవరి 16, 2021న దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 2కోట్ల 43లక్షల కొవిడ్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి