Omicron: ఏడాదిన్నర చిన్నారి.. ఒమిక్రాన్ నుంచి కోలుకుంది!
ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న వేళ ఉపశమనం కలిగించే వార్త! మహారాష్ట్రలో ఇటీవల ఒమిక్రాన్ బారిన పడిన ఏడాదిన్నర చిన్నారి కోలుకుంది. చిన్నారికి తాజాగా నిర్వహించిన ........
మరో మూడేళ్ల బాలుడిలోనూ లక్షణాల్లేవన్న వైద్యులు
పుణె: ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న వేళ ఉపశమనం కలిగించే వార్త! మహారాష్ట్రలో ఇటీవల ఒమిక్రాన్ బారిన పడిన ఏడాదిన్నర చిన్నారి కోలుకుంది. చిన్నారికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జి చేసినట్టు పుణె జిల్లా పింప్రీ-చించ్వాడ్ ప్రాంత ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అలాగే, ఇదే ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలుడిలోనూ ఈ కొత్త వేరియంట్ లక్షణాల్లేవని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో తాజాగా ఒమిక్రాన్ సోకిన నలుగురిలో మూడేళ్ల బాలుడు ఒకరు కాగా.. మిగతా ముగ్గురిలో ఇద్దరు పురుషులు.. ఒకరు మహిళ ఉన్నారు. అయితే, ఈ నలుగురూ నైజీరియా నుంచి తన ఇద్దరు కూతుళ్లతో వచ్చిన మహిళతో కాంటాక్టు అయినవారే కావడం గమనార్హం.
కొద్దిరోజుల ముందు నైజీరియా నుంచి భారత్కు వచ్చిన ఓ మహిళ పింప్రీ చించ్వాడ్లోని తన సోదరుడి వద్దకు వచ్చి కలిసింది. అయితే, ఆ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు ఆమె సోదరుడు, అతని ఇద్దరు కుమార్తెలకు (ఏడాదిన్నర చిన్నారి) ఒమిక్రాన్ పాజిటివ్గా తేలినట్టు వైద్యులు వివరించారు. ఈ ఆరుగురిలో ఒకటిన్నర ఏడాది వయసున్న చిన్నారితో పాటు నలుగురికి నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు వెల్లడించారు. పొడి దగ్గు ఉన్న ఒక మహిళ మినహా మిగతా వారిలో ఎలాంటి లక్షణాలూ లేవని, అందరూ సురక్షితంగానే ఉన్నట్టు వివరించారు. అలాగే, పొడి దగ్గు ఉన్నప్పటికీ ఆ మహిళకు కూడా ఒమిక్రాన్ నెగెటివ్గానే నిర్ధారణ కావడంతో ఆమెనూ డిశ్చార్జి చేశామన్నారు. మరో ఇద్దరు మహిళలకు మాత్రం రిపీట్ టెస్ట్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్గా తేలడంతో వారిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని వివరించారు.
మరోవైపు, ఇదే ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలుడిలోనూ ఎలాంటి లక్షణాల్లేవన్నారు. పిల్లల సంరక్షణ వార్డులో ఉంచామని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పారు. మిగతా ముగ్గురిలోనూ లక్షణాల్లేవన్నారు. వీరి గురించి ఎలాంటి ఆందోళన అవసరంలేదని వెల్లడించారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’