ఉల్లి.. బెంబేలెత్తిస్తోంది మళ్లీ..!
ఉల్లి ధరలు మరోసారి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొద్ది రోజుల వరకూ వంద రూపాయలకు 7-8కేజీల వరకూ లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు కేజీ దొరకటం కూడా గగనమవుతోంది. భారీ వర్షాలు ఉల్లిపంటలపై తీవ్ర ప్రభావం చూపటంతో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయని డీలర్లు చెప్తుంటే...
ఇంటర్నెట్డెస్క్: ఉల్లి ధరలు మరోసారి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొద్ది రోజుల వరకూ వంద రూపాయలకు 7-8 కేజీల వరకూ లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు కేజీ దొరకటం కూడా గగనమవుతోంది. భారీ వర్షాలు ఉల్లిపంటలపై తీవ్ర ప్రభావం చూపటంతో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయని డీలర్లు చెప్తుంటే... కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. కొత్త పంట వచ్చే వరకూ ఈ తిప్పలు తప్పవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కిలో రూ.100 నుంచి రూ.120కి..
దేశవ్యాప్తంగా.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఉల్లి పంట మునిగిపోవడం, ఎక్కువరోజులు నీరు నిల్వ ఉండటం, ఏరడానికి అనుకూలంగా లేకపోవడంతో నేలలోనే ఉల్లి కుళ్లిపోయింది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు నిలువునా నష్టపోవాల్సి వచ్చింది. సరఫరా నిలిచిపోవడంతో మార్కెట్లో అమాంతం ధరలు పెరిగిపోయాయి. ఏకంగా కిలో ఉల్లిగడ్డ ధర రూ.100 నుంచి రూ.120 ఎగబాకిపోవడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
వినియోగదారుల వెతలు
ఇక దక్షిణాదిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు మళ్లీ ఉన్న పంట కూడా దెబ్బతింటుందని, మార్కెట్కు సరకు రావడం లేదని ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఉన్న ఉల్లిని నిల్వ చేసుకునే ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే.. వినియోగదారులపై ఆర్థిక భారం తప్పదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో ఇంట్లో కూర వండుకోలేని పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు. మార్కెట్లో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుబడులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు.
అధిక ఉత్పత్తి ఉన్నప్పటికీ సమస్యలు..
వాస్తవానికి దేశంలో ఉల్లిని అవసరాలకు మించి సాగు చేస్తున్నారు. ఈ కారణంగానే అన్నిచోట్లా పంట చేతికి వచ్చేసరికి ధరలు భారీగా పడిపోతుంటాయి. చివరికి రైతుకు రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో కిలో రూ.2, రూ.3కు విక్రయించిన సందర్భాలు కోకొల్లలు. దేశంలో మొత్తం 22 మిలియన్ల టన్నులకు పైగా ఉల్లి పండుతుండగా.. వాటిలో 15.5 మిలియన్ టన్నుల మేర మాత్రమే వినియోగిస్తున్నాం. మిగిలిన వాటిలో చాలా వరకు పొరుగున ఉన్న చిన్న దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పొరుగు దేశాలతో పోల్చితే భారత్లో ఉల్లి వినియోగం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చైనాలో ప్రతి పౌరుడూ ఏడాదికి సగటున 16 కిలోల ఉల్లిపాయల్ని వినియోగిస్తుండగా, పాకిస్థాన్లో 10.35, శ్రీలంకలో 15, బంగ్లాదేశ్లో 12.5 వినియోగం ఉంది. కానీ భారత్లో సగటున 19 కిలోల మేర వినియోగిస్తున్నారు.
7 రాష్ట్రాల్లోనే 80శాతం సాగు..
ప్రస్తుతం ఉల్లిగడ్డలకు దేశమంతటా గిరాకీ ఉన్నా...ఉత్పత్తి మాత్రం కొన్ని రాష్ట్రాలకే పరిమితం. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్లలోనే 75% ఉల్లి పంట సాగు అవుతోంది. అందులోనూ ఒక్క మహారాష్ట్రే 30% ఉల్లి సాగుచేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలిపితే 7 రాష్ట్రాల్లోనే 80 శాతం ఉల్లి సాగవుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి సాగు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి ఈ గణాంకాలు. ప్రస్తుతం ఉల్లి దిగుబడిలో 20% మాత్రమే సక్రమంగా నిల్వ చేయగలుగుతున్నారు. 30-40% పంట సరైన నిల్వ సౌకర్యాలు లేక పాడవుతోంది.
శాశ్వత మార్గమేదీ..?
ఉల్లి ధరలు పదేపదే చుక్కలు తాకడానికి కారణాలు, శాశ్వత పరిష్కారాలు కనుగొనేంతవరకు అవి జనం జేబుకు చిల్లు పెడుతూనే ఉంటాయి. కొరత ఏర్పడి ధరలు మండినప్పుడు ఉల్లి ఎగుమతులను నిషేధించి, హడావుడిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం పరిపాటిగా మారింది. సమస్య తగ్గగానే...ఆ విషయం విస్మరించటమూ అలవాటైపోయింది. అసలు ఉల్లి ధరలు పెరిగినా తరిగినా రైతుకు లాభం ఉండటం లేదు. పేదలు ఆహారంలో ఉల్లిపాయల వాడకం మానేయడం మినహా ఏమీ చేయలేని స్థితి. ఉల్లి ధరల పెరుగుదల వల్ల లాభపడుతున్నది అక్రమ నిల్వదారులు, నల్లబజారు వర్తకులు మాత్రమే. పంట వల్ల వచ్చే లాభాల్లో అత్యధిక వాటాను అక్రమ నిల్వదారులు, దళారులే చేజిక్కించుకొంటున్నారు. వినియోగ దారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా రైతుల ఆదాయాలను పెంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్