Operation Bulldozer: యూపీలో హింస.. నిందితుల ఇళ్ల కూల్చివేత
రెండోరోజూ బుల్డోజర్ ఆపరేషన్ కొనసాగించిన యోగి ప్రభుత్వం
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల చెలరేగిన అల్లర్లకు కారణంగా భావిస్తున్న నిందితుల ఇళ్లపై యోగి ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా సహ్రాన్పూర్ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఇళ్లను ఇప్పటికే కూల్చివేయగా.. ఆదివారం నాడు ప్రయాగ్రాజ్లో మరో నిందితుడి ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు ఇతడే మాస్టర్మైండ్గా పోలీసులు భావిస్తున్నారు. అయితే, అక్రమ నిర్మాణం కావడం వల్లే ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఆ ఇంటిని కూల్చివేసినట్లు యూపీ మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో శుక్రవారం జరిగిన హింసకు స్థానిక నేత మహమ్మద్ జావేద్ మాస్టర్మైండ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రంగంలోని దిగిన అధికారులు ఆయన ఇల్లు అక్రమంగా నిర్మించారంటూ శనివారం సాయంత్రం నోటీసులు అంటించారు. ఇదే విషయమై అంతకు చాలారోజుల ముందే నోటీసులు జారీ చేసినప్పటికీ మహమ్మద్ జావేద్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అధికారులు పేర్కొన్నారు. అందుకే జూన్ 12వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఇంటిని ఖాళీ చేయాలని సూచించినప్పటికీ అక్కడ నుంచి సమాధానం లేకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం కూల్చివేతకు ఉపక్రమించారు. ముందుజాగ్రత్త చర్యగా స్థానికంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు గాను భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పలు చోట్ల హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఇవి ఉత్తర్ప్రదేశ్తోపాటు పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు విస్తరించాయి. అయితే, ప్రయాగ్రాజ్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు మూడు వందల మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోనూ నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
-
General News
Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
-
India News
Bharat Jodo Yatra: సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’..!
-
Sports News
Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
-
General News
Headaches: గర్భిణికి తలనొప్పా..? వస్తే ఏం చేయాలో తెలుసుకోండి..!
-
Sports News
Chess Olympiad: చెస్ ఒలింపియాడ్లో భారత్కు రెండు కాంస్య పతకాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్కి ఇంటర్నెట్ షేక్
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- BSNL నుంచి లాంగ్ప్లాన్.. ఒక్కసారి రీఛార్జి చేస్తే 300 రోజులు బిందాస్