Israel: ఇజ్రాయెల్ మెరుపుదాడి వెనుక బుర్ర..
వందల కొద్ది రాకెట్లు దూసుకొస్తున్నా.. ఒక్కో దాన్ని గురిపెట్టి మరీ కూల్చిన ఇజ్రాయెల్కు చెందిన ఐరెన్ డోమ్ సత్తాను అమెరికాతో సహా పలు దేశాలు ఆసక్తిగా గమనించాయి. అదే సమయంలో హమాస్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిర్వహించిన
ఆపరేషన్ ‘గార్డియన్ ఆఫ్ దివాల్స్’లో కృత్రిమ మేధ వినియోగం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
వందల కొద్ది రాకెట్లు దూసుకొస్తున్నా.. ఒక్కో దాన్ని గురిపెట్టి మరీ కూల్చిన ఇజ్రాయెల్కు చెందిన ఐరెన్ డోమ్ సత్తాను అమెరికాతో సహా పలు దేశాలు ఆసక్తిగా గమనించాయి. అదే సమయంలో హమాస్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిర్వహించిన ‘ఆపరేషన్ గార్డియన్ ఆఫ్ ది వాల్స్’ యుద్ధతంత్ర చరిత్రలోనే పెద్ద ముందడుగు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ పూర్తిగా కృత్రిమ మేధపై ఆధారపడింది. లక్ష్యాలను గుర్తించడం.. గురిపెట్టడం.. వంటి కీలక కార్యక్రమాలు మొత్తం ప్రత్యేక అల్గారిథమ్స్.. కంప్యూటర్లే చేశాయి. చివరికి హమాస్ అదృశ్య టన్నెల్ నెట్వర్క్లను ధ్వంసం చేయడంలో కూడా వీటి పాత్ర చాలా ఉంది. ఒక రకంగా మిషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లే ఈ యుద్ధాన్ని శాసించాయి. ప్రపంచంలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధను వాడిన తొలి యుద్ధం ఇదే.
డేటానే మందుగుండుగా వాడి..
హమాస్ నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్ ఎప్పుడో గ్రహించింది. దీంతో కొన్నేళ్ల ముందు నుంచే రహస్యంగా శత్రువు ఊహకందని రీతిలో సిద్ధమైపోయింది. ఆ దేశానికి ప్రత్యేక ఇంటెలిజెన్స్ యూనిట్ ‘8200’ ‘అల్కమిస్ట్’,‘గాస్పెల్’,‘డెప్త్ ఆఫ్ విజ్డమ్’ అనే
ప్రత్యేకమైన అల్గారిథమ్స్, కోడింగ్లను తయారు చేసింది. వీటికి ప్రత్యర్థులు వాడే ఎలక్ట్రానిక్ పరికరాల సిగ్నల్స్, విజువల్ ఇంటెలిజెన్స్, గూఢచారులు సమీకరించిన సమాచారం (హ్యూమన్ ఇంటెలిజెన్స్), జియోగ్రాఫికల్ ఇంటెలిజెన్స్ వంటి డేటాను సమీకరించారు. వీటిని విశ్లేషించి.. లక్ష్యాలను గుర్తించారు. డివిజెన్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్లో ఉన్న ‘గాస్పెల్’ అనే అల్గారిథం ఈ డేటాను విశ్లేషించి నమ్మకమైన లక్ష్యాలను గుర్తిస్తుంది. వాటిని ఇజ్రాయెల్ వాయుసేనకు అందిస్తుంది.
ఈ క్రమంలో ఒక మల్టీ డిసిప్లైనరీ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇది గాజాలోని వందల కొద్దీ లక్ష్యాలను గుర్తించి ఇజ్రాయెల్ దళాలకు ఇచ్చింది. దీంతో కచ్చితమైన లక్ష్యాలపై తగినంత బలంతో దాడిచేసే అవకాశం కల్పించింది. వీటిల్లో హమాస్ రాకెట్ లాంఛర్లను భద్రపర్చిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా లక్ష్యాలను వెతుక్కుంటూ సుదీర్ఘకాలం పోరాడాల్సిన అవసరం రాలేదు. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ స్థావరాలు, రాకెట్ లాంఛర్లు, రాకెట్ తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, వారి మిలటరీ ఇంటెజెన్స్ ఆఫీస్లు, డ్రోన్లు, కమాండర్ల ఇళ్లు, హమాస్ నేవల్ కమాండో యూనిట్లు ఈ దాడుల్లో ధ్వంసమైపోయాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ గ్యాస్ క్షేత్రాలకు ముప్పు కల్గించే హమాస్ డ్రోన్ జలాంతర్గాములను భారీగా ధ్వంసం చేసింది.
రాకెట్ లాంఛర్లను గుర్తించింది ఇలా..
ఇజ్రాయెల్ దళాల్లో యూనిట్ ‘9900’కు ప్రత్యేక స్థానం ఉంది. వీరు జియోగ్రాఫీ ఇంటెలిజెన్స్ను సేకరిస్తారు. ఉపగ్రహాల నుంచి వచ్చిన చిత్రాలను విశ్లేషించి.. ఆ ప్రదేశంలో జరిగిన మార్పులను (కట్టడాలు, వాహనాల కదలికలు, నిర్మాణాలు) గుర్తించి దళాలకు ఇస్తారు. దీంతో హమాస్ మోహరించిన రాకెట్ లాంఛర్లను ఇట్టే పసిగట్టింది. ఒక పాఠశాల పక్కనే ఉంచిన 14 రాకెట్ లాంఛర్లను ఈ దళం గుర్తించింది.
నాయకులపై గురి..
ఈ సారి చేసిన దాడుల్లో ఇజ్రయెల్ హమాస్ నాయకత్వంపై గురిపెట్టింది. ఈ దాడుల్లో మొత్తం 150 మంది హమాస్, ఇస్లామిక్ జిహాద్ ఆఫ్ పాలస్తీనా సంస్థల సభ్యులు మరణించారు. వీరిలో అత్యధిక మంది భర్తీ చేయడానికి సాధ్యంకాని నాయకులు ఉన్నారు. ఒక దాడిలో బసీమ్ ఇసాను ఇజ్రాయెల్ దళాలు చంపాయి. అతను ఒక భవనం కింద ఉన్న సొరంగంలో ఉన్నాడు. దీని చుట్టూ ఆరు పాఠశాల భవనాలు ఉన్నాయి. కానీ, ఒక్క పౌరుడు కూడా మరణించకుండా ఐడీఎఫ్ ఆ భవనంపై దాడి చేసింది. అతడు గాజాసిటీ బ్రిగేడ్ కమాండర్. 2014 తర్వాత ఇజ్రాయెల్ చంపిన అతిపెద్ద హమాస్ నేత అతడు. అదే దాడిలో జొమ్మతాహిల్ అనే ఆయుధ తయారీ నిపుణుడు కూడా మరణిచాడు.
బిగ్డేటాతో బిలాల గుట్టురట్టు..!
హమాస్కు ఉన్న అతిపెద్ద బలం సొరంగాల నెట్వర్క్. దీనిని ‘మెట్రో’గా వ్యవహరిస్తారు. దీనిని ఇజ్రాయెల్ రాత్రివేళల్లో వైమానిక దాడులు చేసి ధ్వంసం చేసింది. దీనికోసం కొన్నేళ్లుగా గూఢచారుల నుంచి వచ్చిన సమాచారాన్ని సాంకేతికత సాయంతో విశ్లేషంచి వందల కిలోమీటర్ల మెట్రో మ్యాప్ను తయారు చేసింది. సొరంగం లోతు.. దానిపై ఉన్న నిర్మాణాల సమాచారం.. ఇలా ప్రతి ఒక్కటి ఇజ్రాయెల్ చేతికొచ్చాయి. ఈ దాడుల్లో మొత్తం సొరంగాలను ధ్వంసం చేయలేదని ఇజ్రాయెల్ అంగీకరించింది. కానీ, మళ్లీ వాటిని వినియోగించడానికి అవకాశం లేకుండా మాత్రం ధ్వంసం చేశామని చెబుతోంది.
అప్రమత్తం చేసిన ‘అల్కమిస్ట్’..!
యుద్ధరంగంలో ఉన్న ఇజ్రాయెల్ దళాలను కాపాడే బాధ్యత యూనిట్ 8200 వద్ద ఉన్న ‘అల్కమిస్ట్’ అనే అల్గారిథమ్ నిర్వహించింది. వివిధ మార్గాల్లో వస్తున్న సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించి అందజేసింది. హమాస్, పీఐజీ దళాలు ఎక్కడ దాడి చేసే అవకాశం ఉందో గుర్తించి.. అక్కడి దళాలను అప్రమతం చేశాయి. ఫలితంగా ఇజ్రాయెల్ దళాల వైపు ప్రాణనష్టం అత్యంత తక్కువగా ఉంది. 11 రోజుల యుద్ధంలో ఒమర్ తబీబీ అనే ఒక్క సైనికుడు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. యాంటీట్యాంక్ క్షిపణి వారి వైపు వస్తోందని హెచ్చరించారు. కానీ, అతడు ఆ దాడిలో మరణించాడు. ఇక ఐరన్డోమ్ పనితీరులో కూడా లక్ష్యాలను గుర్తించే కీలకమైన పనిమొత్తం ప్రత్యేక సాఫ్ట్వేర్లే చేశాయి.
ఈ క్రమంలో ఇజ్రాయెల్పై విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ ఆయుధాలు బయటకు చెప్పినంత కచ్చితంగా దాడులు చేయలేదని అంటున్నారు. వారి దాడుల్లో పౌరులు కూడా మరణించడం ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. తమ ఆయుధ ప్రదర్శన కోసమే ఈ దాడులు చేసిందనే విమర్శలు కూడా వచ్చాయి.
ఆధునిక యుగంలో డేటా ఎంత కీలకమైందో హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం చెప్పింది. గతంలో డేటా అంటే ఆధునిక కాల ఇంధనం అని చెబుతారు.. ఇప్పుడు ఆయుధం అని కూడా చెప్పొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి