Parliament: అదే ప్రతిష్టంభన..పట్టువీడని అధికార, ప్రతిపక్షాలు
పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో ఇవాళ కూడా ప్రతిష్టంభన ఏర్పడింది. అధికార, ప్రతిపక్షాలు సరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు.దీంతో ఎలాంటి చర్చోపచర్చలు జరగకుండానే సభ రేపటికి వాయిదా పడింది.
దిల్లీ: అదానీ (Adani) వ్యవహారంపై ప్రతిష్టంభన తొలగడం లేదు. ఇదే అంశంపై పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లోనూ అధికార, ప్రతిపక్షాలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నాయి. అదానీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (JPC) ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టగా.. లండన్లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) క్షమాపణలు చేయాలని అధికార భాజపా (BJP) డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్చోపచర్చలు లేకుండా ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు అదానీకి అధికార భాజపా వత్తాసు పలుకుతోందంటూ ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ఎదుట మానవహారంగా ఏర్పడ్డారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే నేతృత్వంలో భావసారూప్యత కలిగిన పార్టీలనాయకులంతా ఏకమయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇవాళ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ వెల్లోకి దూసుకొచ్చారు. నలుపు రంగు దుస్తులు ధరించి, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ ధన్ఖడ్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. లోక్సభలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అదానీ వ్యవహారంలో జేపీసీ ఏర్పాటు చేయాల్సిందిగా విపక్ష నేతలు పట్టుబట్టారు. నల్లదుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వెల్లోకి దూసుకెళ్లి, భాజపా మంత్రులు, ఎంపీలు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకునేందుకు ప్రతిపక్షానికి అర్హత లేదా?అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవ్వడంతో ఉభయసభలూ రేపటికి వాయిదా పడ్డాయి.
ఇవాళ సభల ప్రారంభానికి ముందు.. భావసారూప్యత గల పార్టీల నాయకులంతా రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేను పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో కలిశారు. డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, శివసేన, జేడీయూ, జేఎమ్ఎమ్, ఎండీఎంకే, ఆప్, వీసీకే, ఐఎంయూఎల్ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మల్లిఖార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. అదానీ విషయంలో విచారణకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలన్నీ పట్టుబడుతుండటంతో.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించాలనే కుట్రతోనే భాజపా నాయకులంతా రాహుల్ క్షమాపణలు చెప్పాలంటూ కొత్త ఎత్తుగడ వేశారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.