4 గంటలు.. టీకా కోసం 10లక్షల మంది నమోదు
కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దేశంలో రెండో దశ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఇందుకోసం కొవిన్ పోర్టల్ను ప్రజలకు నేటి నుంచి అందుబాటులోకి తీసుకురాగా..
దిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దేశంలో రెండో దశ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఇందుకోసం కొవిన్ పోర్టల్ను ప్రజలకు నేటి నుంచి అందుబాటులోకి తీసుకురాగా.. తొలి రోజే విశేష స్పందన లభించింది. కేవలం 4 గంటల్లోనే 10లక్షల మందికి పైగా పేరు నమోదు చేసుకున్నారు. కొవిన్ పోర్టల్ను ఈ ఉదయం 9 గంటలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 10లక్షల మందికి పైగా ఈ పోర్టల్ ద్వారా టీకా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
టీకా తీసుకోవాలనుకునేవారు www.cowin.gov.in లేదా ఆరోగ్యసేతు యాప్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. లేదంటే సమీప వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి కూడా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. ప్రస్తుతానికి కొవిన్ యాప్లో సామాన్య ప్రజలకు నమోదు ప్రక్రియ అందుబాటులో లేదని ఆరోగ్యశాఖ తెలిపింది.
రెండోదశలో భాగంగా 60ఏళ్లు పైబడిన, 45-59ఏళ్ల మధ్యవయస్సు కలిగినవారిలో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు నేటి నుంచి వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు కూడా నేడు టీకా తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటులోనూ వ్యాక్సిన్ వేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ప్రైవేటులో టీకా ఒక్కో డోసు ధర రూ. 250గా నిర్ణయించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్