vaccine: రాష్ట్రాల వద్ద 1.60 కోట్ల డోసులు
కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కొవిడ్పై పోరాటంలో భాగంగా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి.
వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
దిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కొవిడ్పై పోరాటంలో భాగంగా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రాలకు 20 కోట్లకు పైగా డోసులను కేంద్రం ఉచితంగా అందించింది. మే 21 నాటికి వాటిలో 19,73,61,311 టీకాలను రాష్ట్రాలు వినియోగించాయని కేంద్రం వెల్లడించింది. మరో 1.60 కోట్ల (1,60,13,409) డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మరో మూడురోజుల్లో 2.67 లక్షల డోసులను రాష్ట్రాలకు పంపనున్నట్లు వెల్లడించింది.
నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 20.66 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 2,57,299 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 29,23,400కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా