Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
పానీపూరీ తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన పశ్చిమబెంగాల్లోని హూగ్లీ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే, దీన్ని...
కోల్కతా: పానీపూరీ తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన పశ్చిమబెంగాల్లోని హూగ్లీ జిల్లాలో కలకలం రేపింది. అయితే, దీన్ని వైద్యులు డయేరియాగా అనుమానిస్తున్నారు. సుగంధ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం డొగాచియాలోని ఓ స్ట్రీట్ స్టాల్ వద్ద పానీపూరీ తిన్న వారిలో చాలా మందికి వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. సమాచారం అందుకున్న ప్రత్యేక వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించింది. రోగులకు మందులు పంపిణీ చేసింది. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వారిని ఆస్పత్రిలో చేరాలని సూచించారు. అస్వస్థతకు గురైన వారంతా డొగాచియా, బహిర్ రణగచ, మకల్తాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు