Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
పంజాబ్లోని ఆప్ సర్కార్ పెద్ద స్కామ్ను బట్టబయలు చేసింది. రైతులకు ఇవ్వాల్సిన 11వేలకు పైగా పంట అవశేషాల నిర్వహణ ......
విచారణకు ఆదేశించిన ఆప్ సర్కార్
చండీగఢ్: పంజాబ్లోని ఆప్ సర్కార్ పెద్ద స్కామ్ను బట్టబయలు చేసింది. రైతులకు ఇవ్వాల్సిన 11వేలకు పైగా పంట అవశేషాల నిర్వహణ యంత్రాలు మాయమైనట్టు గుర్తించింది. గతంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ రూ.150 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేసిందని.. ఆ యంత్రాలు ఇచ్చినట్టు కేవలం కాగితాల్లోనే పేర్కొన్నారని పంజాబ్ వ్యవసాయశాఖ మంత్రి కుల్దీప్ సింగ్ దహిల్వాల్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన ఈ యంత్రాలు రైతులకు అందలేదన్న సమాచారంతో క్షేత్రస్థాయి సర్వేకు తాను ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
2018 నుంచి ఈ నెల వరకు రైతులకు అందిన యంత్రాలకు సంబంధించిన వివరాలను పరిశీలించగా.. ప్రభుత్వం మొత్తంగా 90,422 యంత్రాలు కొనుగోలు చేసి సబ్సిడీపై లబ్ధిదారులకు పంపిణీ చేసినట్టు పేర్కొన్నప్పటికీ.. వాటిలో కనీసం 11,275 (12శాతం) యంత్రాలు వారికి అందలేదని గుర్తించారు. ఈ యంత్రాలు కొనుగోలు చేసినట్టు కేవలం పేపర్లపైనే ఉందని వెల్లడించారు. ఇందుకు ప్రధాన బాధ్యత అప్పట్లో వ్యవసాయశాఖ బాధ్యతలు చూసిన మాజీ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీదేనన్నారు. వారిద్దరూ స్పందించలేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ డిపార్ట్మెంట్తో విచారణకు సంబంధించిన దస్త్రాన్ని తాను సీఎం భగవంత్ మాన్కి పంపినట్టు మంత్రి వెల్లడించారు. అయితే, ఈ యంత్రాలపై మొత్తం సబ్సిడీ రూ.1200 కోట్లు కాగా.. ఈ వ్యవహారంలో రూ.150 కోట్లు మేర కుంభకోణం జరిగినట్టు తాము అంచనా వేస్తున్నామన్నారు. ఇలాంటి కుంభకోణాలు జరిగితే కేంద్రం నుంచి గ్రాంట్లు పొందడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదంతా ప్రజాధనమని.. ఈ స్కామ్లో ఎవరి ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్ సాల్వే
భారత్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్ న్యాయవాది, మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తప్పుపట్టారు. ప్ -
కోడ్ మీరితే కొరడా!
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. -
బెట్టింగ్ యాప్ కుంభకోణం.. భూపేశ్ బఘేల్పై కేసు
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. -
ఆ రూ.4 వేల కోట్ల వివరాలూ వెల్లడించాలి
ఎన్నికల బాండ్లపై మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించాలంటూ అందులో పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. -
సీఏఏ నిబంధనల అమలుపై స్టే ఇవ్వండి
పౌరసత్వ (సవరణ) నిబంధనలు-2024 అమలుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. -
మగబిడ్డకు జన్మనిచ్చిన మూసేవాలా తల్లి
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా వెల్లడించారు. -
దిల్లీ జల్బోర్డు కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు
దేశ రాజధానిలోని నీటి మండలి (జల్బోర్డు)లో అవకతవకలకు సంబంధించి.. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. -
అయిదేళ్ల రోడ్మ్యాప్ సిద్ధం చేయండి!
లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఘనవిజయం సాధించి వరుసగా మూడోసారి పగ్గాలు చేపడతామన్న భరోసాతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎన్నికల అనంతరం తొలి వంద రోజులకు, ఆ తర్వాత రాబోయే అయిదేళ్ల అభివృద్ధికి కొత్త ప్రభుత్వ రోడ్మ్యాప్ రూపొందించాలని తన మంత్రివర్గ సహచరులను కోరారు. -
హాస్టల్లో నమాజ్ చేస్తున్నారని విదేశీ విద్యార్థులపై దాడి
గుజరాత్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. వసతి గృహంలో నమాజ్ చేస్తున్నారన్న కారణంతో లోపలకి ప్రవేశించిన దుండగులు, విద్యార్థులపై హింసకు తెగబడ్డారు. -
18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం
గుజరాత్లోని అహ్మదాబాద్లో నివాసముంటున్న పాకిస్థాన్కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘవి వారికి పౌరసత్వం ప్రదానం చేశారు. -
నీరే నిజమైన సంపద
భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో నీటి సంక్షోభం కొనసాగుతోంది. వేసవి పూర్తి స్థాయిలో రాక ముందు నుంచే అక్కడి ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. -
3 దశాబ్దాల కిందటే ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు
ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులపై 1957లోనే ఆలోచన చేసినా 3 దశాబ్దాల కిందటే 1994లో తొలిసారిగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. -
మే 15-31 మధ్యే యూజీ-క్యూయెట్
గతంలో ప్రకటించినట్లుగానే యూజీ- కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్)ను మే 15 నుంచి 31 మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. -
సంక్షిప్త వార్తలు (8)
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన వాణిజ్య నౌక ‘ఎంవీ రుయెన్’ను భారత నౌకాదళం ఓ సాహసోపేత ఆపరేషన్తో విడిపించింది. -
సింహభాగం భాజపాకే..
ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన మొత్తాల మరో జాబితా బహిర్గతమైంది. భాజపాకు మొత్తంమీద రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆదివారం అందుబాటులోకి తెచ్చిన డేటాను బట్టి తెలుస్తోంది. -
UGC: ఆ పరీక్షల షెడ్యూల్లో మార్పు ఉండదు: యూజీసీ ఛైర్మన్
సీయూఈటీ (యూజీ) పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. -
Indian Navy: బోట్లను జారవిడిచి.. కమాండోలను దించి.. నడిసంద్రంలో 40 గంటల ఆపరేషన్
సముద్రపు దొంగల చేతిలో నుంచి ఓ వాణిజ్య నౌకను కాపాడేందుకు యుద్ధ బోట్లను సముద్రంలో జారవిడవడంతోపాటు మెరైన్ కమాండోలను రంగంలోకి దించినట్లు భారత నౌకాదళం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆత్మ.. ఆస్తి రాసిచ్చిందట! నకిలీ పత్రాలతో స్థలం కొట్టేసే యత్నం
-
Gudivada Amarnath: గాజువాకలో అమర్నాథ్కు ఝలక్
-
ఆస్కార్కు గుర్తుగా సొంతూర్లో గ్రంథాలయం
-
శ్రీవారి భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్ల జారీ!
-
ఇన్స్టాగ్రామ్లో ప్రకటన.. రూ.40 లక్షలు నష్టపోయిన వ్యాపారి
-
వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్ సాల్వే