ప్రభుత్వ ఆఫీసు సెల్లార్లో 2.31కోట్ల నగదు.. కేజీ బంగారం
ఓ ప్రభుత్వ కార్యాలయంలోని సెల్లార్లో పెద్ద ఎత్తున లెక్కల్లోకి రాని నగదు, బంగారం బయటపడటం రాజస్థాన్ (Rajasthan)లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది.
జైపుర్: దేశంలో చలామణిలో ఉన్న రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన వేళ.. రాజస్థాన్ (Rajasthan)లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజధాని జైపుర్లోని యోజనా భవన్ (Yojna Bhawan) బేస్మెంట్లో లెక్కల్లోకి రాని రూ.2.31 కోట్ల నగదు, కిలో బంగారాన్ని అధికారులు గుర్తించారు. సెల్లార్లోని తాళం వేసిన ఓ అల్మారాలో ఈ సొమ్ము బయటపడింది.
ఈ యోజనా భవన్లో ఐటీ విభాగం, జన్ ఆధార్ వంటి ఆఫీసులున్నాయి. ఈ భవనం బేస్మెంట్లో కొన్ని అల్మారాలు ఉండగా.. వాటిని చాలా నెలలుగా ఉపయోగించడం లేదు. దీంతో తాళాలు వేసి ఉంచారు. శుక్రవారం ఏదో అవసరం నిమిత్తం ఈ అల్మారాలను తెరవగా అందులో ఒక ట్రాలీ సూట్కేస్ కన్పించింది. ఆ సూట్కేస్ను తెరిచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం ఉన్నాయి. దీంతో ఐటీ డిపార్ట్మెంట్ (IT Dept) అదనపు డైరెక్టర్ మహేశ్ గుప్తా వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ సూట్కేసులో మొత్తం రూ. 2.31 కోట్ల విలువైన రూ.2వేలు, రూ.500 నోట్లను గుర్తించారు. దీంతో పాటు కిలో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తెలిపారు.
ఈ ఘటన గురించి తెలియగానే రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)కు అధికారులు సమాచారమిచ్చారు. మరోవైపు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జైపుర్ కమిషనర్ హుటాహుటిన నిన్న అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘డబ్బు, బంగారంతో పాటు కొన్ని ఫైళ్లు కూడా అందులో ఉన్నాయి. వాటిని డిజిటలైజ్ చేశాం. తాళాలు వేసిన మరో రెండు కప్బోర్డులను కూడా తెరిచాం. ఈ బేస్మెంట్ను ఎక్కువగా ఆధార్ విభాగం సిబ్బంది వినియోగిస్తుంటారు. దీంతో ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. సీసీటీవీ ఫుజేట్ను కూడా పరిశీలిస్తున్నాం. డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అన్నది త్వరలోనే బయటపెడతాం’’ అని జైపుర్ పోలీసు కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపారు.
కాగా.. ఈ ఘటన నేపథ్యంలో అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) సర్కారుపై ప్రతిపక్ష భాజపా (BJP) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘‘ప్రభుత్వ కార్యాలయం బేస్మెంట్లో పెద్ద ఎత్తున డబ్బు, బంగారం బయటపడింది. అవినీతిపరులను ప్రభుత్వం రక్షిస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?’’ అని శాసనసభలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ ట్విటర్లో దుయ్యబట్టారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?