40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్‌

భారత్‌ వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని దాటింది. శనివారం ఇచ్చిన 46.38 లక్షల డోసులతో కలిపి దేశంలో టీకాల పంపిణీ 40 కోట్ల మైలురాయిని దాటింది.

Published : 18 Jul 2021 10:09 IST

స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని దాటింది. శనివారం ఇచ్చిన 46.38 లక్షల డోసులతో కలిపి దేశంలో టీకాల పంపిణీ 40 కోట్ల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం 21,18,682 మంది తొలిడోసు స్వీకరించగా.. 2,33,019 మంది రెండో డోసు తీసుకొన్నారు. దీంతో 40.49 కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లైంది. ఇక కొవిడ్‌ సోకిన వ్యక్తికి క్షయ (టీబీ) సోకే అవకాశలు పెరిగిపోతాయని అధికారులు వెల్లడించారు. కాకపోతే, క్షయ సోకిన కేసులు తక్కువగానే ఉన్నాయని చెప్పారు. 2020 నుంచి కొవిడ్‌ నిబంధనల అమల్లో ఉండటంతో దేశంలో టీబీ కూడా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. 

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం మొత్తం 19,36,709 పరీక్షలు నిర్వహించగా 41,157 మందికి పాజిటివ్‌ వచ్చింది. 518 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,13,609కి పెరిగింది. ఇక 42,004 మంది వైరస్‌ నుంచి కోలుకొన్నారు. మొత్తం కోలుకొన్న వారి సంఖ్య 3,02,69,796కు చేరింది. రికవరీ రేటు మెరుగై 97.31శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 4,22,660 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు