Liquor: ఆ రాష్ట్రాల్లో 85 లక్షల లీటర్లకు పైగా మద్యం సీజ్!
ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో 85లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ....
దిల్లీ: ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో 85లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటిలో దాదాపు 70శాతం పంజాబ్లోనే సీజ్ చేసినట్టు తెలిపింది. ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, భారీగా మద్యంతో పాటు ఆయా రాష్ట్రాల్లో రూ.575.39 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ పేర్కొంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, విలువైన లోహాల పంపిణీని నిరోధించేలా ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలను ఏర్పాటు చేయగా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా జప్తు చేసిన మొత్తం రూ.1061.87 కోట్లు ఉంటుందని తెలిపింది. 2017 ఎన్నికలతో పోలిస్తే (రూ.299.84కోట్లు) ఇది మూడున్నర రెట్లు అధికమని అధికమని వెల్లడించింది.
జనవరి 8 నుంచి 85,27,227 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్టు ఈసీ తెలిపింది. వీటిలో అత్యధికంగా పంజాబ్లో 59,65,496 లీటర్లు (రూ.36.79 కోట్లు) స్వాధీనం చేసుకోగా.. యూపీలో 22,94,614 లీటర్లు (రూ.62.13 కోట్లు), ఉత్తరాఖండ్లో 97,176 లీటర్లు (రూ.4.79 కోట్లు), గోవాలో 95,446 లీటర్లు (రూ.3.57 కోట్లు), మణిపూర్లో 74,495 లీటర్లు (రూ.73లక్షలు) చొప్పున స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇకపోతే రూ.575.39 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా.. వీటిలో పంజాబ్లోనే 376.19 కోట్ల విలువచేసే డ్రగ్స్ పట్టుకున్నట్టు తెలిపింది. అలాగే, మణిపూర్లో రూ.143.78 కోట్లు, యూపీ 48.48 కోట్లు, ఉత్తరాఖండ్ 5.66 కోట్లు, గోవా 1.28 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేసినట్టు పేర్కొంది. ఈ ఎన్నికల్లో రూ.154.52 కోట్ల నగదు, రూ.117.44 కోట్ల విలువ చేసే విలువైన లోహాలు, 106.52 కోట్ల విలువచేసే ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని