Oxygen: ఈ ప్లాంట్లు ప్రాణం పోసేదెప్పుడు?
కొవిడ్ ఉద్ధృతి వల్ల ఆక్సిజన్ దొరక్క ఎంతోమంది చనిపోతున్న తరుణంలో కేంద్రం ప్రకటించిన ప్రాణవాయు
మంజూరైన ఆక్సిజన్ తయారీ కేంద్రాలు 1213.. ఏర్పాటైంది 52
తక్షణ అవసరాలు తీరడం మృగ్యమే
ఈనాడు, దిల్లీ: కొవిడ్ ఉద్ధృతి వల్ల ఆక్సిజన్ దొరక్క ఎంతోమంది చనిపోతున్న తరుణంలో కేంద్రం ప్రకటించిన ప్రాణవాయు ఉత్పత్తి కేంద్రాలు (ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్సన్- పీఎస్ఏ ప్లాంట్లు) ఎప్పుడు ఏర్పాటవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బుధవారం ప్రకటించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ప్లాంట్లతోపాటు ఇప్పటివరకు మంజూరైన 1213 పీఎస్ఏ యూనిట్లలో 52 మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. మిగతావి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయన్నదానిపై అయోమయం నెలకొంది.
జనవరి 5న రూ.201.58 కోట్లతో 32 రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో 162 పీఎస్ఏ ప్లాంట్లను ‘పీఎం కేర్స్’ కింద కేంద్రం మంజూరు చేసింది. అంటే ఒక్కో ప్లాంటు ఖర్చు రూ.1.24 కోట్లన్నమాట. వీటి నిర్మాణ, నిర్వహణ బాధ్యతలన్నింటినీ వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని ‘సెంట్రల్ మెడికల్ సప్లై స్టోర్’కు కేంద్రం అప్పగించింది. 162 ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం 154.19 మెట్రిక్ టన్నులు. అంటే ఒక్కో యూనిట్ ద్వారా0.95 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కావాల్సి ఉందన్నమాట.
* ఇవికాక డీఆర్డీవో మరో 500 ప్లాంట్లను ఏర్పాటు చేయాలి.
* పీఎం కేర్స్ కింద ఏప్రిల్ 25న మరో 551 ప్లాంట్లను కేటాయించారు.
* ఈ లెక్కన ఇప్పటివరకూ ప్రకటించిన
* 1213 ప్లాంట్లు త్వరితగతిన ఏర్పాటై ఉంటే దేశంలో 1,152 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అదనంగా ఉత్పత్తి అయి ఉండేది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న 9వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్లో ఇది దాదాపు 13%. ప్రాణాలు నిలపడానికి కొంతవరకూ ఇది అక్కరకొచ్చేది.
ఆలస్యం.. అస్పష్టత..
* కేంద్రం ఆక్సిజన్ ప్లాంట్లను ఘనంగా కేటాయించినా.. వాటి ఏర్పాటు అంశంలో ఆలస్యం జరుగుతోంది. జనవరి 5న మంజూరైన 162 ప్లాంట్లకు అంతకుముందే టెండర్లు పిలిచారు. అయినా ఏప్రిల్ 30 నాటికి 52 చోట్ల మాత్రమే అవి అందుబాటులోకి వచ్చాయి. మరో 87 యూనిట్లను బట్వాడా చేశామని, త్వరలో అవి ఏర్పాటవుతాయని శుక్రవారం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా.. 4నెలల క్రితం ప్రకటించిన ప్లాంట్లలోనే 23 ఏస్థాయిలో ఉన్నదీ ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది.
* తొలుత కేటాయించిన 162 ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతనే ‘సెంట్రల్ మెడికల్ సప్లై స్టోర్’ చూస్తోంది. ఏప్రిల్ 25న మంజూరు చేసిన 551 యూనిట్ల విషయంలో అయోమయం నెలకొంది. వాటికి ఎంత కేటాయించారు? ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తాయన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.
* ఆసుపత్రుల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు 7×9 అడుగుల స్థలం ఉంటే చాలు. కొన్ని వారాల్లోపే వీటిని ఏర్పాటు చేయొచ్చు. నెలకు 2 నుంచి 20 ప్లాంట్లు సరఫరా చేసే సంస్థలు దేశంలో ఉన్నాయి.
* డీఆర్డీవో ప్రకటించిన 500 ప్లాంట్లు అందుబాటులోకి రావడానికీ 3 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం అప్పటికల్లా దేశంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరి, తగ్గుముఖం పట్టే వీలుంది. ఆ సమయంలో ప్లాంట్లు అందుబాటులోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
* ఇప్పటివరకు ఏర్పాటుచేసిన 52 ప్లాంట్లను మినహాయించి పీఎం కేర్స్ కింద మిగిలిన 661 ప్లాంట్లలో నెలకు వంద చొప్పున ఏర్పాటు చేసినా.. అన్నీ అందుబాటులోకి రావడానికి దాదాపు 6 నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వాటివల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం పెద్దగా నెరవేరే అవకాశం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?