Pak-china: పాక్.. మా బ్యాంకులు సిద్ధంగా లేవు..!
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పుడు తెల్ల ఏనుగుల్లా మారాయి. ఇవి పాక్ ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
మిత్రుడికి మొండి చేయి చూపిన చైనా
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పుడు తెల్ల ఏనుగుల్లా మారాయి. ఇవి పాక్ ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పి చేస్తున్నాయి. వీటి రుణాలు చెల్లించకపోతే పోర్టులు, ప్లాంట్లు, భూములు.. ఇలా దేనినైనా చైనా లీజుపేరుతో ఆక్రమించుకొనే ముప్పు ఉంది. మరోపక్క పాకిస్తాన్ తీసుకున్న రుణాలు కొండలా పేరుకుపోయాయి. ఇది చాలదన్నట్లు ఇతర దేశాల నుంచి తెచ్చిన అరువులు కూడా తోడయ్యాయి. ఫలితంగా పాక్ రుణభారం దేశ జీడీపీని మించిపోయింది. దీంతో ఆదుకోమంటూ మళ్లీ చైనా గుమ్మం ఎక్కిన పాక్కు నిరాశే ఎదురైంది. ‘మీకు సాయం చేయాలంటే మా బ్యాంకులు రూల్స్ మార్చుకోవాలి.. కుదరదు’ అంటూ మొండి చెయ్యి చూపింది చైనా.
అసలేం జరిగింది..
తాను చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్ల రుణాన్ని రీస్ట్రక్చర్ చేయమని పాకిస్తాన్ డ్రాగన్ను కోరింది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో నిర్మించిన పవర్ ప్లాంట్లకు సంబంధించిన ఈ బకాయిల విషయంలో సాయం చేసేందుకు చైనా నిరాకరించింది. సీపెక్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు 31 బిలియన్ డాలర్ల రుణ భారం పాక్పై పడింది.
కొన్నేళ్ల క్రితం పాక్లో విద్యుత్తు కొరత ఉండటంతో ప్రైవేటు కంపెనీల నుంచి ‘టేక్ ఆర్ పే’ విధానంలో పవర్ జనరేషన్ కాంట్రాక్టులు కుదుర్చుకొని విద్యుత్తు కొనడం మొదలుపెట్టింది. దీంతో సీపెక్ కింద సమకూర్చిన 19 బిలియన్ డాలర్లను వెచ్చించి ప్రైవేటు కంపెనీలు విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించినట్లు ఏషియా టైమ్స్ పత్రిక వెల్లడించింది. కానీ, పాక్లో పంపిణీ వ్యవస్థకు సంబంధించి గ్రిడ్ లేదు. ఉత్పత్తి చేసిన విద్యుత్తు మొత్తం ఉపయోగించుకొనే పరిస్థితి లేదు. దీంతో ఆ విద్యుత్తును పాక్ సర్కారు కొన్నా.. కొనకపోయినా కంపెనీలకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు విద్యుత్తు కంపెనీలకు 2025 నాటికి 5.9 బిలియన్ డాలర్లు బకాయి ఉంటుందని అంచనా. అందులో దాదాపు సగభాగమే ఇప్పుడు రీస్ట్రక్చర్ చేయమన్న 3 బిలియన్ డాలర్లు.
అధిక రేట్లకు విద్యుత్తు కొనేందుకు ఈ ప్రైవేటు ప్రాజెక్టులతో నేషనల్ ఎలక్ట్రిక్ పవర్ రెగ్యులేటరి అథారిటీ ఒప్పందాలు కుదుర్చుకొందని పీటీఐ పార్టీ సెనెటర్ నుమాన్ వాజ్రి ఆరోపించారు.
చైనా స్పందన ఇదీ..
పాక్ విన్నపంపై చైనా నుంచి తెలివిగా సమాధానం వచ్చింది. ఇప్పటికే ఇచ్చిన రుణాల నిబంధనలు, ఇతర అంశాలపై మరోసారి చర్చించడం కుదరదని పేర్కొంది. పాక్ ఈ రుణాలకు సంబంధించి ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే చైనా బ్యాంకుల నిబంధనలను సవరించాల్సి వస్తుందని పేర్కొంది. చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా.. రుణాల నిబంధనల్లో ఎలాంటి మార్పుల గురించి చర్చించేందుకు సిద్ధంగా లేవని వెల్లడించింది.
అప్పుల కుప్పగా దాయాది..
పాక్ ప్రభుత్వ అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2020 డిసెంబర్ నాటికి అప్పులు 294 బిలియన్ డాలర్లకు చేరుకొన్నాయి. ఇది పాకిస్తాన్ జీడీపీలో 109 శాతానికి సమానం. దేశీయ రుణదాతలకే 158.9 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. విదేశీ అప్పులు దాదాపు 115 బిలియన్ డాలర్లు ఉన్నాయి. పారిస్ క్లబ్ నుంచి 11 బిలియన్ డాలర్లు, వివిధ దేశాల నుంచి 33 బిలియన్ డాలర్లు, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లకు పైగా పాక్ సమీకరించింది. అంతేకాదు, బాండ్ల రూపంలో కూడా అంతర్జాతీయంగా 12 బిలియన్ డాలర్ల నిధులను తీసుకొచ్చింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్కు 12.233 బిలియన్ డాలర్లు వస్తాయని బడ్జెట్లో ఇమ్రాన్ ఖాన్ సర్కారు అంచనా వేయగా.. ఇప్పటి వరకు వచ్చింది 7.208 బిలియన్ డాలర్లు మాత్రమే. వీటిలో విదేశీ వాణిజ్య రుణాలు 3.11 బిలియన్ డాలర్లు, మిగతాది చైనా సేఫ్ డిపాజిట్ల రూపంలో వచ్చింది. బడ్జెట్ అంచనాల్లో 59శాతం మాత్రమే లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్