Pakistan: పాక్.. రఫేల్ శక్తి తెలుసా..?
‘‘చైనా అత్యున్నత శ్రేణి స్టెల్త్ యుద్ధవిమానం జె-20 భారత్కు చెందిన రఫేల్ యుద్ధవిమానంతో ఏమాత్రం పోటీపడలేదు. రఫేల్ రాకతో చైనా శిబిరంలో ఆందోళన నెలకొంది’’ ఫిబ్రవరిలో మీడియాతో
చైనా జె-10సితో పోలుస్తూ.. పాక్ ఆత్మ సంతృప్తి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘‘చైనా అత్యున్నత శ్రేణి స్టెల్త్ యుద్ధ విమానం జె-20.. భారత్కు చెందిన రఫేల్ యుద్ధవిమానంతో ఏమాత్రం పోటీపడలేదు. రఫేల్ రాకతో చైనా శిబిరంలో ఆందోళన నెలకొంది’’ ఫిబ్రవరిలో మీడియాతో మాట్లాడుతూ భారత వాయు సేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ బదౌరియా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ వ్యాఖ్యల వెనుక బలమైన ఆధారాలున్నాయి. చైనా యుద్ధ విమానం జె-20ని.. అమెరికా ఎఫ్-22 రాఫ్టర్ టెక్నాలజీని దొంగిలించి తయారు చేశారు. 2009లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో రఫేల్ విమానం.. ఎఫ్-22 రాఫ్టర్పై తేలిగ్గా గురిపెట్టగలిగింది. ఇది అమెరికాతో సహా ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది.
ఈ నేపథ్యంలో చైనా అత్యున్నత శ్రేణి స్టెల్త్ జెట్ జె-20ని కూడా రఫేల్ తేలిగ్గా ఎదుర్కోగలదు. మరి జె-20 కంటే తక్కువ సామర్థ్యం ఉన్న జె-10సి ఫైటర్ జెట్లు భారత్ రఫేల్ విమానాలకు పోటీ ఇస్తాయని పాక్ మంత్రి గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఈ రెండు విమానాలను చెంగ్డూ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ తయారు చేస్తోంది.
అసలేమిటీ జె-10సి ఫైటర్ జెట్
జె-10 విమానాలను జియాన్-10 అని అంటారు. నాటోదళాలు దీనిని ‘ఫైర్బర్డ్’ అని పిలుస్తాయి. ఇది గగనతల, భూతల దాడులు చేయగల మల్టీరోల్ ఎయిర్క్రాఫ్ట్. 1994లో తొలిసారి దీనిని పరీక్షించారు. ఇది చూడటానికి అమెరికా ఎఫ్-16ను పోలి ఉంటుంది. దీని అప్గ్రేడెడ్ జె-10సి వేరియంట్ను చైనా అభివృద్ధి చేసింది. 2018లో ఆ దేశ వాయుసేనలో ఇది చేరింది. ఈ విమానానికి చైనాలో తయారైన డబ్ల్యూఎస్-10 ఇంజిన్ను అమర్చారు. దీనిని రష్యాకు చెందిన ఏఎల్-31 ఆధారంగా అభివృద్ధి చేశారు. దీని జీవితకాలం 1,500 గంటలకు పెంచినట్లు చైనా పత్రికలు వెల్లడించాయి. ఈ విమానంలో అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్ అమర్చారు. 4.5 జనరేషన్ యుద్ధవిమానంగా దీనిని డ్రాగన్ చెప్పుకొంటోంది. ఈ విమానం అన్ని ఫీచర్లతో పాక్కు అందదు. దీని ఎక్స్పోర్టు వేరియంట్ మాత్రమే పాకిస్థాన్కు విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఫీచర్లు తగ్గే అవకాశం ఉంది. ఈ విమానం పీఎల్ -10, పీఎల్-15 క్షిపణులను ప్రయోగించగలదు. ఇప్పటి వరకూ ఏ యుద్ధాల్లోనూ వినియోగించలేదు. ఈ నేపథ్యంలో దీని సామర్థ్యంపై కచ్చితమైన అంచనాలు లేవు. నిపుణులు ఈ విమానాన్ని ఎఫ్-16, మిగ్-29లకు పోటీగా చూస్తున్నారు.
రఫేల్తో పోటీపడగలదా..?
వాస్తవానికి వైమానిక రంగంలో పశ్చిమ దేశాల సాంకేతికతకు తిరుగులేదు. ఈ రంగంలో ఫ్రాన్స్, అమెరికా మధ్యే ప్రధాన పోటీ. ఫ్రాన్స్కు చెందిన డసో తయారు చేసిన రఫేల్ను ఇప్పటికే మాలీ, అఫ్గానిస్థాన్, సిరియా,లిబియా,ఇరాక్ల్లో జరిగిన యుద్ధాల్లో వినియోగించారు. ఆ యుద్ధాల్లో దీని సామర్థ్యం నిరూపించుకొంది. సుఖోయ్-30 సామర్థ్యానికి మించిన దాడుల్లో వాడేందుకు భారత్ దీనిని కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి స్కాల్ప్, మైకా, మెటియోర్ వంటి క్షిపణులను దీనిలో వినియోగిస్తారు. రఫేల్ విమానాల తయారీకి డసో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. దీనిని ‘కతియ’ అంటారు. విమానంలో అత్యంత చిన్న భాగాలను కూడా దీనిలో డిజైన్ చేసి పరీక్షించిన తర్వాతే వినియోగించారు. రఫేల్లో ‘బడ్డీ-బడ్డీ’ రీఫ్యూయలింగ్ వ్యవస్థ ఉంది. ఫలితంగా దీని రేంజ్ గణనీయంగా పెంచవచ్చు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. ఈ విమానంపై ‘స్పెక్ట్రా’ అనే ఎలక్ట్రానిక్ యుద్ధతంత్ర వ్యవస్థ( వార్ఫేర్సూట్) ఉంది. ఇది శత్రువుల రాడార్లను తప్పుదోవ పట్టిస్తుంది. దీంతోపాటు దూసుకొచ్చే క్షిపణులను తప్పించేలా ప్రత్యేకమైన విద్యుదయస్కాంత తరంగాలను వదులుతుంది. ఈ విమానంలో అమర్చిన ఎం88 ఇంజిన్ జీవితకాలం 6,000 గంటలు. జె-10సీ ఇంజిన్తో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ.
జె-10సీకు అంత సీన్ లేదన్న పాక్ నేత..
పాక్ వద్ద ఇప్పటికే చైనా తయారీ జె-17 యుద్ధవిమానాలు ఉన్నాయి. అవి ఇంజిన్లు లేక మూలనపడ్డాయి. రఫేల్కు పోటీ అంటూ పాక్ జె-10సీలను కొనుగోలు చేయడం వివాదాస్పదమైంది. పాక్ సెనెటర్ డాక్టర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ దీనిని తప్పుబట్టారు. ‘ఇప్పటికే మన దగ్గర జె-10సీ వంటి ఎఫ్-16లు ఉన్నాయి. జె-10సీ రఫేల్ అంత శక్తిమంతమైన విమానం అని నేను అనుకోను. ఈ డబ్బును ప్రాజెక్ట్ ఏజెడ్ఎంపై ఖర్చుచేసి జెఎఫ్-17ను బలోపేతం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు జె-17లకు ఆర్డీ-93 ఇంజిన్లు, స్పేర్పార్టులు లభించడంలేదు. దీంతో పాక్లో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే గాల్లోకి లేచేందుకు సిద్ధంగా ఉన్న యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోతోంది. నాలుగు వైమానిక స్థావరాల్లో కలిపి పాక్ వద్ద 100 జె-17లు ఉన్నాయి. జె-10 విమానాలను విక్రయించేందుకు చైనా పత్రికలు రఫేల్తో పోలుస్తూ కథనాలు వండివార్చాయి. వీటిని అడ్డంపెట్టుకొని ఇప్పుడు పాక్కు అంటగడుతున్నాయి. జె-17ల అనుభవం ప్రత్యక్షంగా చూసి కూడా.. మళ్లీ జె-10సిని కొనుగోలు చేసి దానిని రఫేల్తో పోల్చడం పాక్కే చెల్లింది. అమెరికా ఎఫ్-16 విక్రయాలు, అప్గ్రేడ్లపై సవాలక్ష అంక్షలు విధించడంతో గతిలేక జె-10సిని పాక్ కొనుగోలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్