Pakistan: 12 ఉగ్రవాద సంస్థలకు పాక్ అడ్డా.. అమెరికా పరిశోధన సంస్థ వెల్లడి
లష్కరే తొయిబా, జేషే మొహమ్మద్ తదితర 12 ఉగ్రసంస్థలకు పాకిస్థాన్ ఆవాసంగా ఉందని అమెరికా కాంగ్రెస్కు చెందిన స్వతంత్ర పరిశోధన విభాగం ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్ఎస్)’ వెల్లడించింది.....
వాషింగ్టన్: అమెరికా ద్వారా విదేశీ ఉగ్రవాద సంస్థ(ఎఫ్టీవో)లుగా ముద్రపడిన లష్కరే తొయిబా, జేషే మొహమ్మద్ తదితర 12 ఉగ్రసంస్థలకు పాకిస్థాన్ ఆవాసంగా ఉందని అమెరికా కాంగ్రెస్కు చెందిన స్వతంత్ర పరిశోధన విభాగం ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్ఎస్)’ వెల్లడించింది. పాక్లో ఉగ్ర కార్యకలాపాలపై ‘టెర్రరిస్ట్ అండ్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్థాన్’ పేరిట ప్రత్యేక నివేదికను రూపొందించి, గత వారం నిర్వహించిన క్వాడ్ సమ్మిట్ సందర్భంగా విడుదల చేసింది. ఇందులో భాగంగా పాక్ను ఉగ్ర కార్యకలాపాల స్థావరంగా గుర్తించింది. ప్రధానంగా భారత్, అఫ్గానిస్థాన్లో విధ్వంసమే లక్ష్యంగా.. ఈ 12 విదేశీ ఉగ్రవాద సంస్థలు పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. కొన్ని ఉగ్రసంస్థలు 1980ల నుంచి ఉన్నట్లు తెలిపింది.
భారత్ లక్ష్యంగా దాడులు చేసే లష్కరే తొయిబా, జేషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ పుట్టినిల్లు అని సీఆర్ఎస్ ప్రస్తావించింది. పరిశోధనా విభాగం విడుదల చేసిన ఈ నివేదికలో పాకిస్థాన్లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలను ఐదు రకాలుగా వర్గీకరించింది. అవి ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసే సంస్థలు, అఫ్గాన్లో దాడులు చేసేవి, భారత్ సహా కశ్మీర్లో దాడులకు పాల్పడేవి, పాక్లోనే విధ్వంసం సృష్టించేవి, షియా వర్గానికి వ్యతిరేకంగా పనిచేసేవిగా విడదీసింది.
పాక్ కేంద్రంగా లష్కరే తొయిబా 1980ల కాలం నుంచే కార్యకలాపాలు సాగిస్తుండగా.. 2001లో దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. 2008లోని ముంబయి దాడులు, ఇతర కీలక ఉగ్రదాడులు ఈ సంస్థ పనేనని సీఆర్ఎస్ వెల్లడించింది. 2000లో మసూద్ అజర్ ఏర్పాటు చేసిన జైషే మొహమ్మద్ సంస్థ మరుసటి ఏడాదే ఉగ్రవాద సంస్థగా వెలుగులోకి వచ్చింది. భారత పార్లమెంట్పై దాడి సహా అనేక దాడులకు ఈ సంస్థ పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది. 1980లో పురుడుపోసుకున్న హరాకత్ ఉల్ జిహాద్ ఇస్లామీ తొలుత తాలిబన్లకు సాయం చేస్తూ.. అఫ్గాన్, భారత్, బంగ్లాదేశ్ లక్ష్యంగా ఉగ్రదాడులకు తెగబడుతోంది. కశ్మీర్లోనూ కల్లోలం సృష్టించేందుకు నిరంతరం దాడులకు ప్రయత్నిస్తోంది.
ఇక హిజ్బుల్ ముజాహిద్దీన్ మిలిటెంట్ గ్రూపుల కలయికతో పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న రాజకీయ అనుబంధ ఉగ్రవాద సంస్థ జమ్ముకశ్మీర్ పరిసర ప్రాంతాల్లో తరచూ దాడులకు పాల్పడుతోంది. దాయాది దేశం కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మరో సంస్థ అల్ఖైదా. కరాచీ, గిరిజన ప్రాంతాల్లో ప్రభావం కలిగి ఉన్న ఈ సంస్థ అఫ్గాన్పై ప్రధానంగా దృష్టి సారించింది. ఇలా అనేక ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ సురక్షితమైన కేంద్రంగా ఉందని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ వెల్లడించింది. వీటితోపాటు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్, అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్వర్క్, తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు సీఆర్ఎస్ నివేదికలో ప్రస్తావించింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, అకా జైష్ అల్ అద్, సిపాహీ సహ్బా పాకిస్థాన్, లష్కరే జాంగ్వి లాంటి సంస్థలు సైతం ప్రపంచవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్