G20 meet in Srinagar: బిలావల్ మళ్లీ విషం కక్కాడు...
కశ్మీర్లో జీ20 సదస్సు నిర్వహణపై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. భారత్ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.
ఇంటర్నెట్డెస్క్: జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని కశ్మీర్లో నిర్వహించడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ సమావేశం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. ఆయన పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో నిన్నటి నుంచి మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఈ సమావేశాన్ని ఉపయోగించుకొని అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించడం సాధ్యంకాదు’’ అని పేర్కొన్నారు.
మే 22-24 వరకు జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగుతుంది. దీనిలో 60 మందికి పైగా వివిధ దేశాల ప్రతినిధిలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, మారిషస్, సింగపూర్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే విదేశీ ప్రతినిధులకు సంప్రదాయ పద్ధతిలో షేర్ ఈ కశ్మీర్ ఇంటర్నెషనల్ కన్వెన్షనల్ సెంటర్ వద్ద స్వాగతం పలికారు. శ్రీనగర్ మొత్తం మూడంచల భద్రతా వలయంలో ఉంది. నగరం మొత్తాన్ని ఇప్పటికే భద్రతా దళాలు క్షణ్ణంగా తనిఖీలు చేశాయి. సీసీటీవీలు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించాయి. ఈ మూడు రోజులు విదేశీ ప్రతినిధులను కశ్మీర్లోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.
ఉగ్రదాడులపై ఇంటెలిజెన్స్ అందడంతో గుల్మార్గ్లో జరగాల్సిన జీ20 కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇక్కడ జరిగే కార్యక్రమంపై 26/11 తరహాలో దాడి చేయాలని కుట్రపన్నినట్లు సమాచారం. 370 అధికరణం రద్దు చేసి, జమ్మూకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక ఇక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ కార్యక్రమమిది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధుల కోసం గతంలో ఇక్కడి నుంచి తరలించిన 30 కంపెనీల సీఆర్పీఎఫ్ దళాలు తిరిగి జమ్మూకశ్మీర్కు చేరుకొని భద్రతా విధుల్లో నిమగ్నం అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి