
flight: విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడికి గుండెపోటు.. ఎలా కాపాడారంటే?
దిల్లీ: ఓ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన క్యాబిన్ సిబ్బంది అతడి ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు. కన్నూరు నుంచి దుబాయి వెళ్తున్న గో ఫస్ట్ ఎయిర్లైన్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూనస్ రేయాన్రోత్ అనే వ్యక్తికి గుండెపోటు రాగా.. తమ సిబ్బంది సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతో అతడికి ప్రాణాపాయం తప్పినట్టు విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి ఆపద సమయంలో చురుగ్గా స్పందించిన క్యాబిన్ సిబ్బందికి నగదు రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
‘‘యూనస్ రేయాన్రోత్ అనే ప్రయాణికుడు.. గో ఫస్ట్ విమానంలో కన్నూరు నుంచి దుబాయి వెళ్తున్నాడు. అతడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తోటి ప్రయాణికులంతా హెల్ప్.. హెల్ప్ అని కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రయాణికుడిని గుర్తించారు. అతడిలో నాడీ స్పందన లేదు. శ్వాస తీసుకోవడం లేదు. ఇక ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ఇతర ప్రయాణికుల సహాయంతో విమానంలో వేరే చోటకు మార్చి కార్డియో పల్మనరీ రీసఫిటేషన్ (సీపీఆర్) ప్రక్రియను అనుసరించారు. అదృష్టవశాత్తూ డాక్టర్ షబర్ అహ్మద్ అనే వైద్యుడు కూడా అదే విమానంలో ఉండటంతో అతడి సహాయం తీసుకున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (ఏఈడీ) యంత్రంతో షాక్ ఇవ్వడంతో పాటు సీపీఆర్ ప్రక్రియ చేపట్టి అతడిని బతికించారు. ఆ తర్వాత ప్రయాణికుడిని ఆక్సిజన్పై ఉంచి కోలుకొనే స్థితికి తీసుకొచ్చారు. చివరకు అతడు స్పృహలోకి వచ్చాడు’’ అని ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
అత్యంత ఆపద సమయంలో తమ సిబ్బంది ఎంతో సమర్థంగా పనిచేశారంటూ ఎయిర్లైన్స్ ప్రశంసించింది. వైద్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాక్పిట్ సిబ్బందికి కూడా అప్డేట్స్ చేరవేశారని తెలిపింది. దుబాయిలో విమానం ల్యాండ్ కాగానే యూనస్ చివరకు వీల్చైర్పై దిగారని ఎయిర్లైన్స్ పేర్కొంది. తమ విమానంలో ఎదురైన అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం అందించిన వైద్యుడికి, ఆ ప్రయాణికుడికి కాంప్లిమెంటరీగా ఉచిత టిక్కెట్లు ఇచ్చింది. తమ విమాన నెట్వర్క్లో ఏదైనా దేశీయ లేదా అంతర్జాతీయ ప్రయాణం ఉచితంగా చేసేందుకు అవకాశం కల్పించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
-
Movies News
Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- BJP: అంబర్పేట్లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్