ల్యాండింగ్‌కు ముందు విమానంలో కుదుపులు

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా విమానాశ్రయం వద్ద విస్తారా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌కు 15 నిమిషాల ముందు విమానంలో భారీ కుదుపులు ....

Updated : 07 Jun 2021 22:30 IST

ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా విమానాశ్రయం వద్ద విస్తారా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌కు 15 నిమిషాల ముందు విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ భారీ కుదుపుల నేపథ్యంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో 8మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. ముంబయి నుంచి బయల్దేరిన UK 775 విమానం కోల్‌కతాలో ల్యాండ్‌ కావడానికి 15 నిమిషాల ముందు భారీ కుదుపులకు గురైంది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా  ల్యాండ్‌ అయింది. ఈ ఘటనపై విస్తారా సంస్థ అధికార ప్రతినిధి స్పందించారు. తమ కస్టమర్లకు ఇలాంటి దురదృష్టకరమైన అనుభవం ఎదురవ్వడం పట్ల తమ సంస్థ విచారం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని