Corona: అలాంటప్పుడు టీకా అదనపు రక్షణ
గతంలో ఒకసారి కరోనా సోకిన యువకులు మరోసారి కరోనా బారిన పడే అవకాశం ఉందని ది లాన్సెట్ లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ అధ్యయనాల్లో తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: గతంలో ఒకసారి కరోనా సోకిన యువకులు మరోసారి కరోనా బారినపడే అవకాశం ఉందని ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ అధ్యయనాల్లో తేలింది. అమెరికాలోని మెరైన్స్ సైన్యంలోని 18-20 ఏళ్ల వయసున్న మూడు వేలకుపైగా యువకులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్ సోకిన యువకులు మళ్లీ వైరస్ సోకే అవకాశముందని, అది ఇతరులకు వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
కరోనా బారిన పడి కోలుకున్న యువకుల్లో రోగ నిరోధక శక్తి పెరుతుందని కచ్చితంగా చెప్పలేమని పరిశోధకులు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నా యాంటీబాడీస్ తక్కువగా ఉండేవాళ్లకు సార్స్-కొవ్2 సోకే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ క్రమంలో టీకా అదనపు రక్షణగా పనిచేస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు. అలాగే 65 ఏళ్ల వయసు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94 శాతం తప్పినట్లేనని అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం చేసిన అధ్యయనంలో తేలిన విషయం విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.