Pegasus: పెగాసస్ వ్యవహారంపై ‘సుప్రీం’ విచారణ 13కు వాయిదా
పెగాసస్ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరింత సమయం ఇచ్చింది. దేశ భద్రతకు విఘాతం కలిగించే .....
దిల్లీ: పెగాసస్ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరింత సమయం ఇచ్చింది. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఏ విషయాన్నీ వెల్లడించరాదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. పలు కారణాల వల్ల అఫిడవిట్ దాఖలు చేయలేకపోతున్నామన్నారు. అందువల్ల విచారణను ఈ నెల 9 లేదా 13 తేదీకి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. అందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు ఈ విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. పెగాసస్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ సహా పన్నెండింటిని సుప్రీం ధర్మాసనం విచారణ చేస్తోంది. ఇజ్రాయెల్కు చెందిన స్పైవేర్ పెగాసస్ని ఉపయోగించి దేశంలోని 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్ నంబర్లు హ్యాకింగ్కు పాల్పడినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొనడం పెను రాజకీయ దుమారానికి కారణమైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!