Pedestrians: పాదచారులు ‘హైవే’లపై తిరగకూడదు..!: సుప్రీం కోర్టు
పాదచారులు హైవేలపై తిరగకూడదని సుప్రీం కోర్టు సూచించింది. వారి భద్రత విషయంలో దాఖలు చేసిన ఓ పిటిషన్ను కొట్టేసింది.
దిల్లీ: వాహనాల రాకపోకలకు ఉద్దేశించిన హైవేల (Highways)పై పాదచారులు తిరగకూడదని సుప్రీం కోర్టు (Supreme Court) హితవు పలికింది. ఈ మేరకు క్షమశిక్షణ అవసరమని పేర్కొంది. హైవేలపై పాదచారుల భద్రత (Pedestrians Safety) అంశాన్ని లేవనెత్తుతూ దాఖలైన ఓ పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరిస్తూ.. సుప్రీం కోర్టు ఈ మేరకు సూచనలు చేసింది. ఇదే అంశంపై పిటిషనర్లు తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖను సంప్రదించాలని సూచించింది. దీంతో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఎఫ్ఐఆర్ ఇతర రాష్ట్రంలో నమోదైనా.. ముందస్తు బెయిల్!
ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పరిశీలించింది. ‘అసలు హైవేపైకి పాదచారులు ఎలా వస్తారు? వారికి క్రమశిక్షణ ఉండాలి. వారు హైవేలపై తిరగకూడదు. ప్రపంచంలో ఎక్కడా ఇలా తిరిగే వ్యక్తులు కనిపించరు. భవిష్యత్తులో పాదచారుల కోసం హైవేలపై వాహనాలను ఆపాలని కూడా కోరతారు. అదెలా సాధ్యం?’ అని పిటిషన్దారులను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తే.. వారిని కోర్టు ఎలా సమర్థించగలదు? అని తెలిపింది.
హైవేలపై పాదచారులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయని పిటిషన్దారుల తరఫు న్యాయవాది వాదించగా.. పాదచారులు ఉండకూడని చోట ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘దేశంలో హైవేలు పెరిగాయి. కానీ, మనలో క్రమశిక్షణ పెరగలేదు’ అని వ్యాఖ్యానించింది. ‘ఇది పూర్తిగా అసంబద్ధ పిటిషన్. వాస్తవానికి దీనికి జరిమానా విధించాల్సింది. ఏదేమైనా.. సంబంధిత మంత్రిత్వ శాఖను సంప్రదించేందుకు హైకోర్టు మీకో అవకాశం ఇచ్చింది’ అని పిటిషన్దారులను ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో సక్సెస్.. ఛత్తీస్గఢ్లో బోల్తా.. ఇంతకీ ‘ఎగ్జిట్ పోల్స్’ గెలిచాయా?
Exit polls predictions: ఐదు రాష్ట్రాలకు గాను నాలుగు రాష్ట్రాల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయా? ఎంతవరకు అందుకున్నాయి. -
కళ్లప్పగించి చూడొద్దు మిత్రమా.. కంటిని హెచ్చరించే సాంకేతిక
డిజిటల్ యుగంలో మొబైళ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లను సుదీర్ఘ సమయం పాటు వినియోగించిక తప్పని స్థితి. ఈ వాడకమే పొడిబారే కంటి (డ్రై ఐ) సమస్యకు దారి తీస్తుంది. -
శిరిడీ సాయి కానుకలతో బంగారు, వెండి నాణేలు
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు సమర్పించే బంగారం, వెండి కానుకలను కరిగించి పతకాలు, నాణేలుగా మార్చాలని నిర్ణయించింది. -
Supreme Court: అత్యాచారం కేసు మహిళపై పెట్టొచ్చా?
సాధారణంగా అత్యాచార కేసుల్లో మహిళలు బాధితులుగా ఉంటారు. ఇటువంటి కేసుల్లో మహిళలపై అభియోగాలు నమోదు చేయవచ్చా? అనే అంశం పరిశీలనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
క్రిమినల్ చట్టాల బిల్లులకు హిందీ పేర్లా?
ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్తగా తెస్తున్న బిల్లులకు ఆంగ్లంలో కాకుండా హిందీలో పేర్లు పెట్టి దక్షిణాది ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడు, కేరళ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో శనివారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. -
సౌరగాలి రేణువులను శోధించిన ఆదిత్య-ఎల్1
సూర్యుడిపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఉపగ్రహంలోని ‘ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్’ (ఏఎస్పీఈఎక్స్) అనే పేలోడ్.. సౌర గాలుల్లోని అయాన్లకు సంబంధించిన కొలతలను విజయవంతంగా సేకరించింది. -
రైల్వేలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోంది: ఖర్గే
రైల్వేలను నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. -
గగన్యాన్కు వ్యోమగాములు సిద్ధం
‘గగన్యాన్’ కోసం ఎంపికైన వ్యోమగాములు రోదసిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
‘రైతు నేతల నిర్బంధాన్ని సహించం’
మూడు వ్యవసాయ చట్టాల(ప్రస్తుతం రద్దయ్యాయి)ను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆరోపించింది. -
తరగతి గదుల్లో హిజాబ్ వద్దన్నందుకు బెదిరింపులు
అమ్మాయిలను తరగతి గదుల్లో హిజాబ్ (ముఖ వస్త్రం) తొలగించాలని కోరినందుకు బిహార్లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఆయా విద్యార్థినుల కుటుంబాల నుంచి బెదిరింపులు వచ్చాయి. -
ఆప్ ఎంపీ సంజయ్పై ఛార్జ్షీట్
దిల్లీ మద్యం కుంభకోణం, దానికి సంబంధించిన నగదు అక్రమ లావాదేవీల వ్యవహారంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్పై ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. -
ఏడు గంటలు ఆలస్యంగా ఎయిర్పోర్ట్కు విమానం
దేశ రాజధాని దిల్లీ నుంచి పట్నాకు వెళ్లాల్సిన విమానం ఏడు గంటలు ఆలస్యంగా విమానాశ్రయానికి రావడంపై ప్రయాణికులు మండిపడ్డారు. -
ప్రభుత్వం బలహీనుల పక్షం వహించాలి
సామాజికంగానూ, సంఖ్యాపరంగానూ దుర్బలులుగా ఉండే ప్రజలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచినప్పుడే ప్రజాస్వామ్యంలో పౌరులందరూ స్వేచ్ఛగా ఉండగలరని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
డీప్ఫేక్పై ముర్ము ఆందోళన
దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ఫేక్ వీడియోలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరోసారి ఆందోళన వ్యక్తంచేశారు. -
బహిష్కరణ.. మరీ కఠినమైన శిక్ష
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరిస్తే.. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లోక్సభలో కాంగ్రెస్ సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి పేర్కొన్నారు. -
కశ్మీర్ ప్రధాన రహదారిపై భారీగా మంచు
జమ్మూకశ్మీర్లోని పూంఛ్ జిల్లా పీర్ పంజాల్ పర్వత ప్రాంతంలో విస్తారంగా మంచు కురుస్తోంది. ప్రధాన రహదారి అయిన మొగల్ రోడ్డుపై గుట్టలుగా పేరుకుపోతోంది. -
14 ఏళ్లకే మూడు డాక్టరేట్లు.. వంద ప్రపంచ రికార్డులు!
అమ్మ, అమ్మమ్మల స్ఫూర్తితో యోగాపై ఆసక్తి పెంచుకుంది ప్రిశా. పట్టుదలతో నిరంతర సాధన చేసి పిన్నవయసులోనే అద్భుతాలు సాధించింది. -
రామయ్య ప్రాణప్రతిష్ఠకు రారమ్మని ఆహ్వానాలు
అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ఆహ్వాన పత్రికల పంపిణీ ప్రారంభమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనవరి 22న నిర్వహించనున్న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వాన పత్రికలను పంపుతోంది. -
11 మందికి రూ.కోటికి పైగా వార్షిక వేతనం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-గువాహటిలో 2023-24 సంవత్సరానికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులు తొలి రోజు 164 ఉద్యోగాలు పొందారు. -
ఆర్మ్స్ట్రాంగ్ జుత్తు.. జాబిల్లి శిలలు
చంద్రుడిపై కాలుమోపిన తొలి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జుత్తు, చందమామ, అంగారకుడి శిలలు వంటి వాటిని కోల్కతాలోని అంతరిక్ష ప్రదర్శనశాలలో ఇక నుంచి వీక్షించొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
Rajasthan: సంప్రదాయానికే జై.. రాజపుత్రుల కోటలో ‘కాషాయం’ రెపరెపలు!
-
Kamareddy: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి
-
Congress: తెలంగాణ ప్రజలకు థాంక్స్.. 4 రాష్ట్రాల ఫలితాలపై ఖర్గే రియాక్షన్ ఇదే..
-
Assembly Election Results: భాజపా ‘ట్రిపుల్’ ధమాకా.. మూడు రాష్ట్రాల్లో కమలం సునామీ
-
Assembly Election Results: ‘నా ఎత్తు ఎంతో తెలిసిందా..?’ ప్రియాంకా గాంధీకి సింధియా కౌంటర్
-
Revanthreddy: ఇక నుంచి ప్రగతి భవన్.. ప్రజా భవన్ అవుతుంది: రేవంత్రెడ్డి