Perarivalan: రాజీవ్ గాంధీ హత్య కేసు.. 31ఏళ్ల తర్వాత బయటకు రానున్న దోషి!
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాళన్.. సుప్రీం కోర్టు తీర్పుతో 31ఏళ్ల జైలు జీవితం తర్వాత ఎట్టకేలకు బయటకు రానున్నారు.
ఓ తల్లి పోరాట ఫలితమంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు
చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాళన్.. సుప్రీం కోర్టు తీర్పుతో 31ఏళ్ల జైలు జీవితం తర్వాత ఎట్టకేలకు బయటకు రానున్నారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన సమయంలో 19ఏళ్ల ప్రాయంలో అరెస్టైన పెరారివాళన్కు తొలుత మరణశిక్ష పడింది. అయితే, ఎలాగైనా తన కుమారుడిని జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆయన తల్లి ఆర్పుతమ్మళ్ చేసిన పోరాటం చివరకు ఫలించినట్లయ్యింది. ఓ వైపు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు ఆమె చేసిన న్యాయపోరాటంలో విజయం సాధించింది. మాజీ ప్రధాని హత్య కేసులో దోషి అయినప్పటికీ.. తన కుమారుడుని రక్షించుకునేందుకు పెరారివాళన్ తల్లి చేసిన ప్రయత్నాలను గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆమెపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
బ్యాటరీల కొనుగోలుతో..
1991 మే 21న అప్పటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడికి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్ (LTTE) సభ్యుడు శివరాజన్ కీలక సూత్రధారి అని తేలింది. ఆ బాంబు తయారీకి అవసరమైన రెండు బ్యాటరీలను (తొమ్మిది వోల్టులు) పెరారివాళన్ కొనుగోలు చేసి ఇచ్చారనే అభియోగాలపై అరెస్టయ్యారు. అయితే, ఆ బ్యాటరీలను కొనుగోలు చేసినప్పటికీ వాటి ఉద్దేశం మాత్రం తనకు తెలియదని పెరారివాళన్ వాదిస్తూ వస్తున్నారు. ఇక ఈ కేసులో పెరారివాళన్కు తొలుత 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించగా.. 2014లో సుప్రీంకోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న పెరారివాళన్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
స్వేచ్ఛా వాయువులు పీల్చాలని అనుకొంటున్నా..
మూడు దశాబ్దాల తర్వాత జైలు శిక్ష అనుభవించిన పెరారివాళన్.. తనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పుపై మీడియాతో మాట్లాడారు. ‘మరణశిక్ష అవసరం లేదని బలంగా విశ్వసిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించే ముందు స్వేచ్ఛా వాయువులను పీల్చాలని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు. తన కుమారుడు విడుదలపై మాట్లాడిన అర్పుతమ్మళ్.. తనకు తెలియని వాళ్లు కూడా ఎంతో మంది మద్దతు ఇచ్చారని, వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
తీర్పును స్వాగతించిన రాజకీయ పార్టీలు
రాజీవ్ హత్య కేసులో పెరారివాళన్కు మరణశిక్ష పడినప్పటికీ 2014 సుప్రీం కోర్టు నిలుపుదల చేయడంతోపాటు ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చడంతో దోషుల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. వారితో పాటు తమిళనాడు ప్రభుత్వం కూడా దోషులను విడుదల చేయాలంటూ 2016, 2018లో అప్పటి గవర్నర్లకు సిఫార్సు చేసింది. చివరగా ఆయనను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై కూడా సుప్రీంతీర్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన పెరారివాళన్ విడుదలను తమ పార్టీ స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తెలిపారు. ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో, పీఎంకే నేత ఎస్ రామ్దాస్, ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్తోపాటు ఇతర తమిళ సంఘాలు కూడా పెరారివాళన్ విడుదలను స్వాగతించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్