PFI: లష్కరే, ఐసిస్లో చేరేందుకు పీఎఫ్ఐ ప్రేరేపిస్తోంది.. ఎన్ఐఏ నివేదిక
ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నేతలు ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనేక పత్రాలు
కోచి: ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనేక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ పత్రాల్లో అత్యంత కీలక సమాచారం లభించినట్లు ఎన్ఐఏ తెలిపింది. లష్కరే తోయిబా, ఐసిస్, అల్ఖైదా వంటి ఉగ్రముఠాల్లో చేరేలా ఈ సంస్థ యువతను ప్రేరేపిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదకలో పేర్కొంది.
పీఎఫ్ఐ కార్యాలయాల్లో జరిపిన సోదాల సందర్భంగా కొంతమంది సంస్థ సభ్యులను అధికారులు అరెస్టు చేశారు. అందులో 10 మంది కస్టడీ కోరుతూ ఎన్ఐఏ న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేసింది. ఈ నివేదికను సెప్టెంబరు 22న కోర్టుకు సమర్పించగా.. అందులోని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పీఎఫ్ఐ ప్రభుత్వ విధానాలను వక్రీకరిస్తూ.. ఓ వర్గం వారిలో దేశం పట్ల విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని నివేదిక పేర్కొంది. అంతేగాక, ఓ వర్గానికి చెందిన ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్రలు రచిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ నివేదిక తెలిపింది. ఈ కుట్రలకు సంబంధించి లోతైన సమాచారం తెలుసుకునేందుకు ఆ 10 మందిని కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని కోరింది. ఇందుకు అనుమతించిన ప్రత్యేక కోర్టు.. నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
మోదీ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు కుట్రలు..
పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఎన్ఐఏతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా సోదాలు జరిపింది. ఈ సందర్భంగా కేరళలో కొంతమంది పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకుంది. వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ప్రధాని మోదీ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు కుట్రలు పన్నినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
ఈ ఏడాది జులై 12న మోదీ బిహార్లో పర్యటించారు. ఆ సమయంలో ప్రధాని ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు ప్రణాళిక రచించామని పీఎఫ్ఐ సభ్యుడు ఒకరు విచారణలో చెప్పినట్లు ఈడీ తెలిపింది. అందుకోసం శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడమే గాక, పోస్టర్లు, బ్యానర్లను కూడా సిద్ధం చేసినట్లు ఆ సభ్యుడు తెలిపినట్లు సమాచారం. అంతేగాక, దేశంలో ఉగ్ర కార్యకలాపాల కోసం పీఎఫ్ఐ విదేశాల నుంచి నిధులు సేకరించిందని ఈడీ గుర్తించింది.
విదేశాల నుంచి నిధులు అందుకొని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న అభియోగాల నేపథ్యంలో సెప్టెంబరు 22న పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ, ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో సోదాలు జరిపి 106 మందిని అరెస్టు చేసింది. పీఎఫ్ఐ ప్రభావం అధికంగా ఉన్న కేరళలో 22 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో ఆ సంస్థ ఛైర్మన్ ఓ.ఎం.ఎ.సలామ్ కూడా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.