Pfizer: 12 వారాల గడువుతో విస్తృత యాంటీబాడీలు!
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల యాంటీబాడీల ప్రతిస్పందన మరింతగా పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
లండన్: కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల యాంటీబాడీల ప్రతిస్పందన మరింతగా పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న 12 వారాల తర్వాత రెండో డోసు ఇవ్వడం వల్ల యాంటీబాడీల ప్రతిస్పందనలు దాదాపు మూడున్నర రెట్లు పెరిగినట్లు బ్రిటిష్ అధ్యయనంలో తేలింది. దీంతో వ్యాక్సిన్ డోసుల వ్యవధిని పెంచడం సరైన నిర్ణయమనడానికి ఇటువంటి శాస్త్రీయ అధ్యయనాలు మద్దతుగా నిలుస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన ప్రారంభంలో చాలా వ్యాక్సిన్లు మూడు, నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసులను అందించాయి. ఇందులో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులను మూడు వారాల గడువుతో ఇచ్చి ప్రయోగాలు జరపడంతో.. పంపిణీలోనూ అదే విధానాన్ని పాటించింది. ఈ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా చేపడుతోన్న బ్రిటన్లో ఫైజర్ టీకానే అధికంగా వినియోగిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభ సమయంలో రెండు డోసుల మధ్య వ్యవధి మూడు వారాలే ఇచ్చిన్నప్పటికీ అనంతరం వ్యాక్సిన్ విధానంలో మార్పులు చేశారు. ఈ గడువును 12వారాలకు బ్రిటన్ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం అదే విధానంలో అక్కడ వ్యాక్సిన్ పంపిణీ చేపడుతోంది.
డోసుల మధ్య గడువును పెంచిన నేపథ్యంలో.. వీటి పనితీరును తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హమ్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం 80 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్న 175 మందిపై అధ్యయనం జరిపారు. వీరి సమాచారాన్ని.. మూడు వారాల గడువుతో వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోల్చి చూశారు. తద్వారా 12 వారాల వ్యవధి తర్వాత రెండో డోసు తీసుకున్న వృద్ధుల్లో యాంటీబాడీలు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని అధ్యయనానికి నేతృత్వం వహించిన బర్మింగ్హమ్ యూనివర్సిటీ నిపుణులు హెలెన్ ప్యారీ పేర్కొన్నారు. వీటిపై మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
బ్రిటన్ విధానంతో సత్ఫలితాలే..!
రోగనిరోధక వ్యవస్థలో యాంటీబాడీలు ఒకభాగం మాత్రమే. వ్యాక్సిన్ల వల్ల కేవలం యాంటీబాడీలే కాకుండా టి-కణాలు కూడా ఉత్పత్తి అవుతాయి. అయితే, మూడు వారాల గడువులో రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ఈ టి-కణాలు గణనీయంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఏ విధానాన్ని అనుసరించి వ్యవధిని పెంచుతారనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మిగిలింది. ఏదేమైనప్పటికీ వ్యాక్సిన్ పంపిణీలో బ్రిటన్ తీసుకున్న విధానం నిజంగా సత్ఫలితాలిచ్చిందని ఇంగ్లాండ్ ప్రజారోగ్య విభాగానికి చెందిన కన్సల్టెంట్ ఎపిడమాలజిస్ట్ గాయత్రీ అమిర్థలింగం స్పష్టంచేశారు. అంతేకాకుండా ఈ విధానం వల్ల మరింత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇక ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ భారత్లో కొవిషీల్డ్ పేరుతో లభ్యమవుతున్న విషయం తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేస్తోన్న ఈ వ్యాక్సిన్ రెండు డోసుల గడువును 12 నుంచి 16 వారాలకు పెంచుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల మధ్య గడువు వల్ల ఏవిధమైనా ఫలితాలు ఉంటాయనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పొడిగించడాన్ని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సమర్థించారు. వ్యాక్సిన్ల కొరత ఉన్నప్పుడు ఎక్కువ మందికి తొలి డోసు ఇవ్వడానికి ఇది సరైన నిర్ణయమని తెలిపారు. దీనివల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. అంతేకాకుండా వ్యాక్సిన్ సామర్థ్యం విషయంలో ఇది ప్రయోజనమే చేకూరుస్తుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!