Vaccine: ఫైజర్, మోడెర్నా.. మనకు 2023 తర్వాతేనా
దేశంలో టీకాల కొరతను తీర్చేందుకు విదేశీ వ్యాక్సిన్ల కోసం ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఫైజర్, మోడెర్నా వంటి సంస్థలతో చర్చలు కూడా జరుపుతోంది. అయితే చర్చలు
దిల్లీ: దేశంలో టీకాల కొరతను తీర్చేందుకు విదేశీ వ్యాక్సిన్ల కోసం ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఫైజర్, మోడెర్నా వంటి సంస్థలతో చర్చలు కూడా జరుపుతోంది. అయితే చర్చలు ఫలించినా.. ఈ కంపెనీల టీకాల డెలివరీ కోసం భారత్ సుదీర్ఘంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఫైజర్, మోడెర్నా టీకాలు మరో రెండేళ్ల లోపు దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పించట్లేదు. ఈ టీకాల కోసం 2023 వరకు ఆర్డర్లు పూర్తిగా బుక్ అయినట్లు తెలుస్తోంది.
నిజానికి భారత్లో టీకా అత్యవసర వినియోగం కోసం ఫైజర్ సంస్థ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. అయితే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను అప్పట్లో నిపుణుల కమిటీ తిరస్కరించడంతో ఫైజర్ తన దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగడంతో ఏప్రిల్ 13న ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్లపై కీలక ప్రకటన చేసింది. డబ్ల్యూహెచ్ఓ అనుమతినిచ్చిన వ్యాక్సిన్లు, ఇతర దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు భారత్లో రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని కేంద్రం ఏప్రిల్లో స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన వెలువడి నెలన్నర దాటినా.. ఇప్పటివరకు ఫైజర్, మోడెర్నా సంస్థలు భారత్లో ఎలాంటి ఒప్పందానికి రాకపోవడం గమనార్హం.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ టీకా దిగుమతిపై అక్కడి వ్యాక్సిన్ తయారీ సంస్థలతో చర్చించనున్నారు. అయితే భారత్ కంటే ముందే చాలా దేశాలు ఫైజర్, మోడెర్నా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు వందల మిలియన్ల డోసులకు ఆర్డర్లు పెట్టాయి. ఈ సంస్థలు 2023 దాకా ఈ ఆర్డర్లనే డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మిగులు టీకాలు ఉంటే తప్ప ఫైజర్, మోడెర్నా మన దేశానికి వ్యాక్సిన్లు సరఫరా చేయలేవని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నిన్న చెప్పారు. అంటే.. ఈ లెక్కన భారత్కు ఈ టీకాలు రావాలంటే ఇంకా రెండేళ్లయినా పడుతుందేమో..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్