ఫైజర్ టీకాకు 97శాతం ప్రభావశీలత!
ఫైజర్-బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 97శాతం ప్రభావశీలత కనిపించిందని వెల్లడైంది.
వాస్తవ ఫలితాల్లో వెల్లడి
బెర్లిన్: ఫైజర్-బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 97శాతం ప్రభావశీలత కనిపించిందని వెల్లడైంది. వ్యాక్సిన్ సమర్థతపై ప్రయోగ ఫలితాలు ఇప్పటికే వెల్లడైనప్పటికీ, లక్షణాలున్న రోగుల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఫార్మా కంపెనీల విశ్లేషణలో తేలింది.
ఇజ్రాయెల్లో భారీ స్థాయిలో చేపట్టిన వ్యాక్సినేషన్లో ఫైజర్ టీకాను అందిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 40శాతం మందికి వ్యాక్సిన్ అందించారు. ఇందులో భాగంగా జనవరి 17 నుంచి మార్చి 6వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సమాచారాన్ని విశ్లేషించారు. ఇందులో లక్షణాలు లేని కరోనా కేసుల్లో 94శాతం సమర్థత కనబరిచినట్లు ఇప్పటికే వెల్లడైంది. ప్రస్తుతం లక్షణాలు కనిపించిన వారిలోనూ 97శాతం ప్రభావశీలత ఉన్నట్లు తేలింది. అంతకు ముందు డిసెంబర్లో జరిపిన విశ్లేషణల్లోనూ ఇదే తరహా ఫలితాలు కనిపించినట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోన్న సమయంలో తాజా ఫలితాలు ఎంతో కీలకమని వ్యాక్సిన్ కంపెనీలు పేర్కొన్నాయి.
ఆరు దేశాల్లో నిలిచిన టీకా పంపిణీ..
కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలో వందకుపైగా దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే, వ్యాక్సిన్ దుష్ఫలితాలు చూపిస్తున్నాయన్న కారణంతో కొన్ని దేశాలు వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేశాయి. ఇలా ఇప్పటివరకు ఆరు దేశాల్లో టీకా పంపిణీ నిలిచిపోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకడుతున్నట్లు తాజాగా డెన్మార్క్లో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అక్కడ పంపిణీ చేస్తోన్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రక్తం గడ్డకట్టడానికి వ్యాక్సిన్ కారణమా అనే అంశంపై స్పష్టత రాలేదని పేర్కొంది. ప్రస్తుతం వీటిని సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారని, అందుకే తాత్కాలికంగా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అంతకుముందు ఆస్ట్రియాతో పాటు ఎస్తోనియా, లాట్వియా, లిథ్వేనియా, లుక్సెంబర్గ్ దేశాలు తాత్కాలికంగా వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.