Mann Ki Baat: అమర్ జవాన్ జ్యోతి మాదిరే.. అమరుల స్ఫూర్తి శాశ్వతం
అమర్ జవాన్ జ్యోతి జ్వాల మాదిరే.. అమరవీరుల త్యాగాలు, స్ఫూర్తి శాశ్వతమని ప్రధాన నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల ఇండియా గేట్ వద్ద బోస్ హోలోగ్రాం విగ్రహం ఆవిష్కరణ, అమర్ జవాన్ జ్యోతిని సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకం...
ఈ ఏడాది తొలి ‘మన్కీ బాత్’ ప్రసంగంలో ప్రధాన నరేంద్ర మోదీ
దిల్లీ: అమర్ జవాన్ జ్యోతి జ్వాల మాదిరే.. అమరవీరుల త్యాగాలు, స్ఫూర్తి శాశ్వతమని ప్రధాన నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్ర బోస్ హోలోగ్రాం విగ్రహం ఆవిష్కరణ, అమర్ జవాన్ జ్యోతిని సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకం(నేషనల్ వార్ మెమోరియల్) వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేయడం ఘట్టాలను గుర్తుచేస్తూ.. దేశం ఇప్పుడు తన జాతీయ చిహ్నాలను గౌరవించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. అమర్ జవాన్ జ్యోతి.. అమరవీరుల త్యాగానికి చిహ్నమని పేర్కొంటూ పలువురు తనకు లేఖలు రాశారని వెల్లడించారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించాలంటూ పౌరులను కోరారు.
* నేడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపూజీకి నివాళులర్పించారు. జాతిపిత ఆదర్శాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని.. దేశ సాయుధ దళాల సిబ్బంది త్యాగాలను గుర్తుచేసుకున్నారు. గాంధీ వర్ధంతిని ఏటా అమరవీరుల దినోత్సవంగా పాటిస్తారు.
* ఆయా రంగాల్లో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులు పొందిన బసంతీ దేవి(ఉత్తరాఖండ్), లోరెంబమ్ బెయినో దేవి(మణిపూర్) తదితరులను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వారిని ‘అన్సంగ్ హీరోలు’గా అభివర్ణిస్తూ.. వారి సేవలను కొనియాడారు.
* దేశంలో అవినీతిని రూపుమాపేందుకు యువత కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. విద్య ఆవశ్యకతను వివరిస్తూ.. సమాజంలోని ప్రతి స్థాయిలో చదువు పట్ల అవగాహన కనిపిస్తోందన్నారు.
* ప్రకృతిని ప్రేమించడం, ప్రతి జీవి పట్ల దయతో వ్యవహరించడం భారతీయ సంస్కృతిలో భాగమని ప్రధాని అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్లో ‘కాలర్ వాలీ’ పులికి అటవీ శాఖ అధికారులు తుది వీడ్కోలు పలికిన తీరును గుర్తుచేశారు. అలాగే, రాష్ట్రపతి అంగరక్షక దళంలోని అశ్వం ‘విరాట్’ వీడ్కోలనూ ప్రస్తావించారు.
* మహమ్మారి మూడో వేవ్తో దేశం విజయవంతంగా పోరాడుతోందని ప్రధాని తెలిపారు. ఇప్పటివరకు 4.5 కోట్ల మందికి పైగా పిల్లలు టీకాలు పొందారని చెప్పారు. ఇదిలా ఉండగా.. నేటి ‘మన్కీ బాత్’ 85వ ఏపిసోడ్ కాగా, ఈ ఏడాదిలో మొదటిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..