Modi: ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్
కాంగ్రెస్ పాలనతో మనం దశాబ్ద కాలాన్ని కోల్పోయామని ప్రధాని మోదీ (Modi) దుయ్యబట్టారు. వారి హయాంలో జరిగిన కుంభకోణంతో దేశం పరువుపోయిందన్నారు. లోక్సభలో ప్రసంగించిన ఆయన.. ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దిల్లీ: తమ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అది కొందరిని బాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) అన్నారు. దేశ ప్రగతిని చూసి బాధపడేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ప్రతిపక్షాలనుద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ బుధవారం లోక్సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)) సహా విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
వారి విద్వేషం బయటపడింది..
‘‘రాష్ట్రపతి (President) ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంతో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. కోట్లాది భారతీయులకు మార్గదర్శనం చేశారు. ప్రథమపీఠంపై ముర్ము (Droupadi murmu) కూర్చోవడంతో ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కింది. దేశాధినేతగా ఆమె భారత మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి ప్రథమ పౌరురాలిని అవమానించేలా కొందరు నేతలు (రాహుల్, కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ) నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాకుండా అవమానించి వారు కూడా ప్రసంగించారు. వారి స్వభావమే అంత. అయితే ఆ ప్రసంగంతో వారిలోని సమర్థత, విద్వేషం బయటపడింది’’ అని రాహుల్ (Rahul Gandhi)ను ఉద్దేశిస్తూ ప్రధాని ఎద్దేవా చేశారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకే..
‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా.. ఆ సంక్షోభం నుంచి భారత్ బయటపడగలిగింది. నేడు ప్రపంచానికి మన దేశం ఆశాదీపంగా మారింది. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్లు అందించినందుకు యావత్ ప్రపంచం మనల్ని ప్రశంసించింది. మనపై గౌరవం పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంపై ప్రపంచం ఆసక్తిగా చర్చించుకుంటోంది. జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోంది. కొవిడ్ ఉన్నప్పటికీ భారత్ ఐదో ఆర్థికశక్తిగా ఎదిగింది. ఇవన్నీ కొందర్ని బాధిస్తున్నట్లున్నాయి. దేశ ప్రగతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని విపక్షాలకు మోదీ హితవు పలికారు.
ఆ దశాబ్దాన్ని కోల్పోయాం..
ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress) పాలనపై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘2004 నుంచి 2014 మధ్య యూపీఏ హయాంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అంతటా హింసే కన్పించింది. అవినీతి, ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో కన్పించింది. వారి హయాంలో జరిగిన కామన్వెల్త్ ఆటల కుంభకోణంతో దేశం పరువుపోయింది. కాంగ్రెస్ ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చేసింది. ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం’’ అంటూ ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ ఉత్థాన పతనాలపై హార్వర్డ్ వర్శిటీలోనూ పరిశోధన జరిగిందన్నారు.
విపక్షాలను ఏకం చేస్తున్నది ఈడీనే..
గత 9 ఏళ్లుగా విపక్ష నేతలు ఆలోచన లేకుండా ఆరోపణలే చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. ఆర్బీఐ, ఈసీ, సైన్యంపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిర్మాణాత్మక విమర్శలను తాము స్వాగతిస్తామన్నారు. ‘‘నేడు విపక్ష నేతలు ఏకమవుతున్నది దేశం కోసం కాదు.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వల్లే ఒక్కటవుతున్నారు. విపక్షాలను ఈడీ ఏకం చేస్తోంది’’ అని ప్రధాని విమర్శించారు.
టీవీ ప్రచారాలతో మోదీపై భరోసా రాలేదు..
‘‘మా హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశ ప్రజలు మోదీపై భరోసా ఉంచారు. అంతేగానీ, టీవీ ప్రచారాల వల్ల కాదు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసమే మోదీపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. వారి నమ్మకమే నాకు సురక్షా కవచం. ఆ రక్షా కవచాన్ని ఎవరూ ఛేదించలేరు. విపక్షాల అవాస్తవాలను ప్రజలు నమ్మరు. కేంద్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందే ప్రజలకు నిజానిజాలేంటో తెలుసు. 2030 దశాబ్దం.. భారత దశాబ్దంగా నిలుస్తుంది. భారత్.. ప్రజాస్వామ్య మాతృభూమి. ప్రజాస్వామ్య బలోపేతం కోసం చిత్తశుద్ధితో కృషి జరగాలి’’ అని మోదీ వెల్లడించారు.
ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్లో భారత్ జోడో యాత్ర ముగింపు సభను ప్రస్తావించిన మోదీ.. ‘‘ఇప్పుడు జమ్ముకశ్మీర్కు అందరూ వెళ్లివస్తున్నారు. గతంలో లాల్చౌక్లో జాతీయ జెండా ఎగురవేయడం ఓ కలగా ఉండేది. దమ్ముంటే లాల్చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని తీవ్రవాదులు పోస్టర్లు వేసేవారు. మా ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఆ పరిస్థితిని మేం మార్చాం. లాల్చౌక్లో స్వేచ్ఛగా జెండా ఎగురవేయగలుగుతున్నాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి అందుతోందని ప్రధాని అన్నారు. సాంకేతికత అభివృద్ధితో డేటా వినియోగం పెరగడమేగాక, ధర తగ్గిందన్నారు. మధ్యతరగతిపై తమ ప్రభుత్వం మరింత దృష్టిపెట్టిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్