World Lion Day: దేశంలో కొన్నేళ్లుగా సింహాల సంఖ్య పెరుగుతోంది: మోదీ

గడచిన కొద్ది సంవత్సరాలుగా దేశంలో సింహాల సంఖ్య పెరుగుదలలో  స్థిరమైన

Published : 10 Aug 2021 23:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గడచిన కొద్ది సంవత్సరాలుగా దేశంలో సింహాల సంఖ్య పెరుగుదలలో  స్థిరమైన పెరుగుదల నమోదవుతోందని  ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రపంచ సింహాల దినోత్సవాన్ని పురస్కరించుకొని వాటి పరిరక్షణకు పాల్పడుతున్న వారికి మోదీ  ట్విట్టర్  ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సింహం రాజసానికి, శౌర్యానికి ప్రతీక అన్న మోదీ.. భారతదేశం ఆసియా సింహాలకు ఆవాసం కావడం గర్వకారణమన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో గిర్ సింహాల ఆవాసాల పరిరక్షణకు పాటుపడే అవకాశం కలిగిందని గుర్తు చేశారు. స్థానికుల సహకారంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సింహాల పరిరక్షణకు అనుసరిస్తున్న విధానాలను నాడు సమర్థవంతంగా అమలు చేసినట్లు తెలిపారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు