తమిళ రైతుల కృషి ప్రశంసనీయం: మోదీ
తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన తమిళనాడుకు విచ్చేశారు.
చెన్నై: తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన తమిళనాడుకు విచ్చేశారు. చెన్నైలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ.. రెండేళ్ల క్రితం ఇదే రోజున పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకం కింద చెన్నై నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు.
చెన్నైలో రూ.3,770 కోట్లతో చేపట్టిన మెట్రో రైల్ ఫేజ్-1 ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. ఈ మెట్రో కారిడార్ నార్త్ చెన్నై నుంచి విమానాశ్రయాన్ని, సెంట్రల్ రైల్వే స్టేషన్ను కలుపుతూ 9కిలోమీటర్ల మేర నిర్మించారు. దాంతో పాటు రూ.293 కోట్లతో చెన్నై బీచ్, అట్టిపట్టు ప్రాంతాల మధ్య రైల్వే లైన్ను ప్రారంభించారు. అదేవిధంగా చెన్నైలోని తైయూర్ సమీపంలో రూ.1000 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఐఐటీ మద్రాస్కు చెందిన డిస్కవరీ క్యాంపస్కు శంకుస్థాపన చేశారు.
రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులు
‘చెన్నై ఎంతో శక్తిమంతమైన నగరం. ఈ నగరం జ్ఞానం, సృజనాత్మకతకు నిలయం. ఇక్కడ మనం ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మన స్వదేశీ అభివృద్ధికి చిహ్నాలు. దేశీయంగా అభివృద్ధి చేసిన అర్జున్ యుద్ధ ట్యాంక్ను దేశానికి అంకితం చేయడం ఎంతో గర్వంగా ఉంది. తమిళనాడు ఇప్పటికే దేశంలో ఆటోమొబైల్ హబ్గా నిలిచింది. ఇప్పుడు నేను ఈ రాష్ట్రాన్ని యుద్ధ ట్యాంకుల తయారీకి కేంద్రంగా చూస్తున్నా. దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో తమిళనాడు రైతులు ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. నీరు ఇతర వనరుల్ని ఇక్కడి రైతులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ‘పర్ డ్రాప్.. మోర్ క్రాప్’ అనే నినాదాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి’ అని మోదీ తమిళనాడు రైతుల కృషిని కొనియాడారు.
అమరుల త్యాగాలు మరువలేనివి
రెండేళ్ల క్రితం ఇదేరోజున చోటుచేసుకున్న పుల్వామా ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ..‘ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులు. పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన ఈ రోజును భారతీయులెవరూ మరచిపోలేరు. మన భద్రతా దళాలను చూసి దేశం గర్విస్తోంది. వారి త్యాగాలు దేశ ప్రజలకు ఆదర్శం’ అంటూ మోదీ సైనికుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోంది. ఈ దశాబ్దం భారత్దే. దేశంలో సంస్కరణలకు కట్టుబడి ఉన్నామనే విషయానికి ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెటే నిదర్శనం. మత్స్యకార సమాజాన్ని చూసి గర్విస్తున్నాం. తమిళనాడులో ఐదు ఫిషింగ్ హార్బర్లు త్వరలో ఏర్పాటు కానున్నాయి. శ్రీలంకలో ఉన్న తమిళ సోదరులు, సోదరీమణుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మత్స్యకారుల ప్రయోజనాలకు మా ప్రభుత్వం ఎప్పుడూ అనుకూలమే’ అని మోదీ వెల్లడించారు.
ఇదీచదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత