PM Modi: భారత ప్రజాస్వామ్యంపై విదేశాల్లో వ్యాఖ్యలు దురదృష్టకరం: మోదీ
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ (Cambridge University)లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుబట్టారు. భారత ప్రజాస్వామ్యం గురించి విదేశాల్లో తక్కువ చేసి మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
బెంగళూరు: బ్రిటన్ పర్యటన సందర్భంగా లండన్ (London)లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ (Cambridge University)లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ (PM Modi) తప్పుబట్టారు. భారత ప్రజాస్వామ్యం గురించి విదేశాల్లో ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరమంటూ పరోక్షంగా రాహుల్ని విమర్శించారు. భారత ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తులూ నీరుగార్చలేవన్న ప్రధాని.. కొందరు అదే పనిగా డెమోక్రసీపై దాడి చేస్తున్నారని అన్నారు. వీరంతా కన్నడ ప్రజల ఆరాధ్యదైవం బసవేశ్వరుడ్ని, కర్ణాటక ప్రజల్ని, భారత ప్రజానీకాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని కర్ణాటక ప్రజలు దూరం పెట్టాలని హితవు పలికారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. హుబ్బళ్లిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ప్లాట్ఫాంను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ధార్వాడ్ (Dharwad)లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు భారత ప్రజాస్వామ్యం గురించి అధ్యయనం చేస్తున్నాయి. ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని చెప్పే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో భారత్ ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా మాట్లాడటం దురదృష్టకరం’’ అని ప్రధాని మోదీ అన్నారు.
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగేలా తనతోపాటు ఎంతో మందిపై అధికార పార్టీ నాయకులు ప్రత్యేక నిఘా ఉంచారంటూ లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. స్వాతంత్యం వచ్చిన నాటి నుంచి భారత్ సాధించిన అభివృద్ధిని ప్రధాని మోదీ తుంగలో తొక్కేశారని ఆయన విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గత 60-70 ఏళ్లలో భారత్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విదేశాల్లో మోదీ ప్రకటించాలని రాహుల్ సవాల్ విసిరారు. గడిచిన పదేళ్లలో భారత్లో అంతులేని అవినీతి రాజ్యమేలుతోందని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, భాజపా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పదేపదే ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రాహుల్ గాంధీ.. విదేశాల్లో భారత్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ప్రవర్తించారని భాజపా మండిపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!