Covid: మరో 4 రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్
దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ సీఎంలు
దిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ సీఎంలు ఉద్ధవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్, శివరాజ్ సింగ్ చౌహన్, జైరామ్ ఠాకూర్లకు వేర్వేరుగా ఫోన్ చేసిన ప్రధాని.. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితుల గురించి చర్చించారు.
మధ్యప్రదేశ్లో కరోనా కేసులు, తగ్గుతున్న పాజిటివిటీ రేటు గురించి ప్రధానికి వివరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహన్ మోదీతో ఫోన్ సంభాషణ అనంతరం ట్విటర్లో వెల్లడించారు. ‘‘కరోనా వ్యాప్తి నియంత్రణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ కట్టడికి కేంద్రం నుంచి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు’’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రధానితో ఫోన్లో మాట్లాడినట్లు హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్ కూడా ట్విటర్లో పేర్కొన్నారు. ఇక మహారాష్టకు మరింత ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే ప్రధానిని కోరారు.
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అక్కడ శుక్రవారం 54వేల కొత్త కేసులు నమోదవ్వగా.. 898 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇక మధ్యప్రదేశ్లో నిన్న 11,708, హిమాచల్ప్రదేశ్లో 4,177 కొత్త కేసులు వెలుగుచూశాయి. తమిళనాడులోనూ వైరస్ విజృంభణ ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో తాజాగా 26వేల పైచిలుకు రోజువారీ కేసులు బయటపడ్డాయి. కరోనా వ్యాప్తి కట్టకి కోసం నూతనంగా ఏర్పాటైన స్టాలిన్ ప్రభుత్వం రెండు వారాల సంపూర్ణ లాక్డౌన్ విధించింది.
గత మూడు రోజులుగా ప్రధాని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి కొవిడ్ పరిస్థితిపై ఆరా తీస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ సంభాషణను విమర్శిస్తూ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేయడం.. దాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఖండించడం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)