PM Modi: ఎన్ని చోట్ల ఓడిపోతున్నా.. మీ అహం తగ్గట్లేదు: కాంగ్రెస్పై మోదీ ఫైర్
దేశంలో జరుగుతున్న పలు ఎన్నికల్లో ఓడిపోతున్నా కాంగ్రెస్ నేతలకు అహంకారం మాత్రం తగ్గడంలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు....
దిల్లీ: దేశంలో జరుగుతున్న పలు ఎన్నికల్లో ఓడిపోతున్నా కాంగ్రెస్ నేతలకు అహంకారం మాత్రం తగ్గడంలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో మాట్లాడిన ప్రధాని.. కాంగ్రెస్ సహా పలు విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనేక రాష్ట్రాల్లో ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్లో మార్పు రావడంలేదన్నారు. ఒడిశా, గోవా, నాగాలాండ్ ప్రజలు 25 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ను వెళ్లగొట్టారన్న మోదీ.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణ ప్రజలూ ఆ పార్టీని తిరస్కరించారన్నారు. దేశంలో కొవిడ్ తొలిదశలో వైరస్ వ్యాప్తికి బాధ్యత కాంగ్రెస్దేనన్నారు. కరోనా ప్రారంభ దశలో కాంగ్రెస్ అన్ని పరిధులూ దాటిందనీ.. కొవిడ్ వైరస్ దేశమంతా వ్యాపించడానికి, వలసకూలీల సంక్షోభానికి ఆ పార్టీ నేతలే కారణమయ్యారంటూ ధ్వజమెత్తారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. కాంగ్రెస్పై మాటల తూటాలు పేల్చారు.
- రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ నాయకత్వ పాత్రను ఎలా పోషించగలదో ఆలోచించేందుకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సరైన సమయమని మోదీ అన్నారు. కరోనా కాలం తర్వాత ప్రపంచం కొత్త క్రమంలో, కొత్త వ్యవస్థల వైపు వేగంగా కదులుతోందన్న ప్రధాని.. ఇది మనకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదన్నారు. కరోనా తర్వాత భారత్ ప్రపంచంలో మంచి గుర్తింపు సాధించుకుందనీ.. ప్రపంచ నాయకత్వ పాత్రను పోషిస్తోందన్నారు. రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్న ప్రధాని.. రక్షణ రంగంలో పెండింగ్ సమస్యల్ని పరిష్కరిస్తున్నట్టు చెప్పారు.
- ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ అనేది స్టేటస్ సింబల్గా ఉండేది.. కానీ ఇప్పుడు అత్యంత పేదవాళ్లకు కూడా అందుబాటులోకి రావడం సంతోషదాయమన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి రావడం, డీబీటీ వంటి సేవలు వంటి కీలక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పేదల ఇళ్లలో గ్యాస్ కనెక్షన్ వచ్చి.. పొగలు కక్కే పొయ్యి నుంచి విముక్తి లభిస్తే ఆ ఆనందం మరోలా ఉంటుందన్నారు. దేశం స్వాతంత్ర్యం సాధించాక ఇన్నాళ్లకు పేదలకు గ్యాస్ కనెక్షన్లు, ఇళ్లు, శౌచాలయాలు అందుబాటులోకి తీసుకొచ్చామనీ.. అందరికీ సొంత బ్యాంకు ఖాతాలూ ఉన్నాయన్నారు. కానీ దురదృష్టవశాత్తు విపక్ష నేతల ఆలోచనలు ఇంకా 2014లోనే చిక్కుకుపోయాయంటూ ధ్వజమెత్తారు.
- కరోనా సమయంలో కాంగ్రెస్ పరిధి దాటి ప్రవర్తించిందని మోదీ మండిపడ్డారు. కరోనా తొలి దశలో డబ్ల్యూహెచ్వో ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలన్న సూచనతో మేం లాక్డౌన్ ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతలు ముంబయి రైల్వేస్టేషన్లో వలసకూలీలకు ఉచితంగా రైలు టిక్కెట్లు ఇచ్చి కొవిడ్ వ్యాప్తికి కారణమయ్యారంటూ విరుచుకుపడ్డారు. వలస కూలీలనూ కష్టాల్లోకి నెట్టారంటూ దిల్లీ సహా పలు భాజపాయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వేలెత్తిచూపారు. దిల్లీలోని ప్రభుత్వం మురికివాడల్లోకి మైక్లతో వెళ్లి.. వలస కూలీలకు బస్సులు ఏర్పాటు చేస్తాం.. వెళ్లిపోవాలని సూచించిందన్నారు. ఇలాంటి చర్యలతో యూపీ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయని మోదీ ఆక్షేపించారు.
- కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉంది.. కానీ కొందరు రాజకీయ ప్రయోజనాలకోసం ఆ పరిస్థితులను దుర్వినియోగం చేశారన్నారు. కొవిడ్తో మోదీ ఇమేజ్కి నష్టం జరుగుతుందని కొందరు ఆలోచించారని ఆరోపించారు. ‘‘నేను.. వోకల్ ఫర్ లోకల్ గురించి మాట్లాడితే దాన్ని పట్టించుకోరు. భారత్ స్వయం సమృద్ధి దేశంగా అవతరించాల్సిన అవసరంలేదా? గాంధీజీ కలలు సాకారం కావడం మీకు ఇష్టంలేదా?’ అని కాంగ్రెస్ని ప్రధాని నిలదీశారు.
- ‘‘మీరు (కాంగ్రెస్) నన్ను వ్యతిరేకించండి.. కానీ ఫిట్ ఇండియా ఉద్యమం, ఇతర పథకాలను ఎందుకు విమర్శిస్తారు? యోగా గురించి ఎవరు గర్వపడరు? దాన్నీ ఎగతాళి చేశారు. కొన్నేళ్లుగా అనేక రాష్ట్రాల్లో మీరు అధికారానికి దూరం కావడంలో ఆశ్చర్యమేమీ లేదు.. అసలు మరో వందేళ్ల వరకు అధికారంలోకి వచ్చే ఆలోచన కూడా మీకు లేదని నేను భావిస్తున్నాను’’ అన్నారు.
- ‘‘కరోనా సమయంలో దేశంలో ఎవరూ ఆకలితో చనిపోరాదని 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ పంపిణీ చేశాం. ఈరోజు భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థ. మన మొత్తం ఎగుమతులు అధికంగా ఉన్నాయి. అదికూడా కొవిడ్ కాలంలో.’’ అని చెప్పారు.
- ‘‘కరోనా సమయంలో చిన్న రైతుల్ని కష్టాలనుంచి గట్టెక్కించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. చిన్న రైతులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వారిపై దృష్టి పెట్టాం. చిన్న రైతుల బాధలు తెలియనివారికి వారిపేరిట రాజకీయాలు చేసే హక్కులేదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా కొందరు వ్యక్తులు తమబానిస మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు. జీవితాంతం రాజభవనాల్లో ఉండేవారికి రైతుల కష్టాలేం తెలుస్తాయి?’’ అని విమర్శించారు.
- ‘‘ప్రతిపక్షాలకు ఫైల్స్ ముఖ్యం.. కానీ మాకు దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ముఖ్యం. కొవిడ్ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోంది. మన దేశ రైతులు రికార్డు స్థాయి పరిమాణంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారు. వీధి వ్యాపారులు తొలిసారి బ్యాంకు రుణాలు పొందారు. డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. 2014లో 500 స్టార్టప్ కంపెనీలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 60వేలకు చేరింది. పారిశ్రామికవేత్తలు కరోనా వేరియంట్లు అని మాట్లాడే వ్యక్తులు కాంగ్రెస్లో ఉన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని వ్యక్తులు చరిత్రకు దూరమవుతారు’’ అన్నారు.
- ‘‘మన దేశ యువత, సంపద సృష్టికర్తలు, పారిశ్రామికవేత్తలను భయపెట్టే విధానాన్ని మేం అంగీకరించం. మేకిన్ ఇండియాపై కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి. అవినీతికి చోటులేదనే మేకిన్ ఇండియాపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. 'మేక్ ఇన్ ఇండియా'పై ఎవరైనా సలహాలు ఇవ్వొచ్చు.. కానీ అది విఫలమవుతుందని చెప్పడం ఎలాంటి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది? మేకిన్ ఇండియాని ఎగతాళి చేసిన వారే జోక్గా మారిపోయారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.
- ‘‘కాంగ్రెస్ ఇప్పుడు తుక్డే తుక్డే గ్యాంగ్కు నాయకత్వం వహిస్తోంది. కాంగ్రెస్ విధానమే గతంలో బ్రిటిష్ వారు అనుసరించిన ‘విభజించి పాలించడం’. ప్రజాస్వామ్యయుతంగా మమ్మల్ని అడ్డుకోలేకే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నారు.. కానీ మమ్మల్ని అడ్డుకోలేరు. కాంగ్రెస్ పార్టీ తమిళ ప్రజల సెంటిమెంట్ను గాయపరిచే ప్రయత్నం చేసింది. దేశాన్ని విడగొట్టి పాలించడం వారి డీఎన్ఏలోనే ఉంది. సీడీఎస్ బిపిన్ రావత్ మృతిచెందిన సమయంలో రోడ్ల వెంబడి నిలబడి నివాళులర్పించిన తమిళనాడు పౌరులకు సెల్యూట్ చేస్తున్నా’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ