PM Modi: ఆప్యాయంగా పలకరిస్తూ.. నవ్వులు చిందిస్తూ.. విపక్ష నేతలతో ప్రధాని మోదీ ముచ్చట్లు
జి-20 సదస్సు ఏర్పాట్లపై ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమయంలో విపక్ష నేతలను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరిస్తూ, నవ్వుతూ ముచ్చటించారు.
దిల్లీ: ప్రతిష్ఠాత్మక జీ-20 దేశాల సదస్సును (G20 Summit) ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించేందుకుగానూ ప్రధాని మోదీ (Narendra Modi) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి జాతీయ పార్టీల ముఖ్యనేతలతోపాటు వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. ఆ సమయంలో విపక్షపార్టీల నేతలను (Opposition Leaders) ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఒక్కొక్కరికి నమస్కరిస్తూ.. వారితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించారు. నిత్యం ప్రధాని మోదీపై విరుచుకుపడే ప్రధాన విపక్ష నేతలు కూడా ఎంతో ఆప్యాయంగా మోదీతో సంభాషించినట్లు కనిపిస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగాలను ప్రధాని మోదీ పలకరించారు. వీరితోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడులతో మాట్లాడుతూ నవ్వులు చిందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..