ప్రధాని మోదీ బ్రిటన్‌ పర్యటన రద్దు

ఈ ఏడాది జూన్‌ 11-13 మధ్య బ్రిటన్‌లో జరిగే జీ7 సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ నేరుగా హాజరవ్వడం లేదు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సదస్సుకు ప్రత్యేక...

Updated : 21 Dec 2022 14:56 IST

దిల్లీ: ఈ ఏడాది జూన్‌ 11-13 మధ్య బ్రిటన్‌లో జరిగే జీ7 సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ నేరుగా హాజరవ్వడం లేదు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా మోదీని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని తన బ్రిటన్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు