PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. తన వద్ద ఉన్న భూమిని విరాళంగా ఇచ్చేయడంతో ప్రస్తుతం ఆయన ఆస్తుల .......
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. తన వద్ద ఉన్న భూమిని విరాళంగా ఇచ్చేయడంతో ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉంది. ఏటా ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోదీ.. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. పీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ప్రధాని ఆస్తులు రూ.26లక్షల మేర పెరిగాయి. మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉండగా.. వీటిలో అధికంగా బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. మోదీకి ఎలాంటి స్థిరాస్థులూ లేవని పీఎంవో స్పష్టంచేసింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న కొంత నివాసయోగ్యమైన భూమిలో తన వాటాను దానంగా ఇచ్చినందున ఆయనకు స్థిరాస్తులేమీ లేవని తెలిపింది. బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మోదీకి పెట్టుబడులు లేవని, ఆయనకు సొంత వాహనం కూడా లేదని వెల్లడించింది. కానీ ఆయనకు నాలుగు బంగారం ఉంగరాలు ఉండగా.. వాటి విలువ రూ.1.73లక్షలుగా ఉంటుందని డిక్లరేషన్లో పేర్కొంది. అయితే, మార్చి 31 2021 నాటికి మోదీ వద్ద ఉన్న రూ.1.1 కోట్ల విలువ చేసే ప్లాట్ను విరాళంగా ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన వద్ద ఎలాంటి స్థిరాస్తులు లేవని పేర్కొంది. దీంతో ఈ ఏడాది మార్చి 31 నాటికి మోదీ మొత్తం ఆస్తుల విలువ రూ.2,23,82,504లుగా ఉన్నట్టు తెలిపింది.
2002 అక్టోబర్లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మరో ముగ్గురు వాటాదార్లతో కలిసి కొనుగోలు చేసిన నివాసయోగ్య భూమి (సర్వే నంబర్ 401/ఎ)లో ఒక్కొక్కరికి 25శాతం సమాన వాటా ఉందని.. దాన్నే మోదీ విరాళంగా ఇచ్చినట్టు తెలిపింది. దీంతో ప్రస్తుతం మోదీ చేతిలో రూ.35,250నగదు, పోస్ట్ ఆఫీస్లో రూ.9,05,105 విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లతో పాటు రూ.1,89,305 విలువ చేసే జీవిత బీమా పాలసీ ఉన్నట్టు పేర్కొంది.
మరోవైపు, ప్రధానితో పాటు తమ ఆస్తుల వివరాలు వెల్లడించిన కేబినెట్ మంత్రుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రూ.2.54కోట్ల విలువ చేసే చరాస్తులు ఉండగా.. రూ.2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తం 29 మంది కేబినెట్ మంత్రులు ఉండగా.. గత ఆర్థిక సంవత్సరంలో తమ సొంత, వారిపై ఆధారపడిన వారి ఆస్తులు ప్రకటించిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్కే సింగ్, హర్దీప్సింగ్ పురీ, పురుషోత్తం రూపాలా, జి.కిషన్ రెడ్డి ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేబినెట్ మంత్రిగా పనిచేసి, గత నెలలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
UPSC Civils 2024: ‘సివిల్స్’ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్ ఇదే..
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. -
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
సార్వత్రిక ఎన్నికల్లో ఏఐతో సృష్టించిన నకిలీ సమాచార కట్టడికి మెటా ప్రత్యేకంగా ‘ఎలక్షన్ ఆపరేషన్స్ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
తొలి లోక్సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 71 వేల మంది ‘సెక్యూరిటీ డిపాజిట్’ కోల్పోయినట్లు ఈసీ విశ్లేషణలో వెల్లడైంది. -
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
తమిళనాడులోని సేలంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ నాయకుడి సేవలను గుర్తుచేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ? -
Himanta Biswa Sarma: ‘మేం గేట్లు తెరిస్తే..’: కాంగ్రెస్కు హిమంత వార్నింగ్
కాంగ్రెస్పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ప్రధాని మోదీ(Modi) సూర్యుడని కొనియాడారు. -
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. -
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
మిగతా నటీనటుల యాక్టింగ్ నచ్చినప్పటికీ.. అమితాబ్ బచ్చనే (Amitabh Bachchan) తనకు ఇష్టమైన నటుడని భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. -
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వడంలో విఫలమైనందుకు పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
Liquor Policy Case: దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది. -
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
తమ దేశీయుల్ని రక్షించడంలో భారత నౌకాదళం ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బల్గేరియా నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వీటికి ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. -
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్ను నిలిపివేసిన గూగుల్
చిన్నప్పటి ఫొటోను డ్రైవ్లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ షాకిచ్చింది. అతడి అకౌంట్ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే
ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. -
పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. -
ఆజం ఖాన్కు ఏడేళ్ల జైలుశిక్ష
ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘సామాజిక’ ప్రచారం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్, సామాజిక మాధ్యమాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. -
వేడెక్కుతున్న ఉత్తర భారతం
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. -
స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్పై జై శంకర్ స్పందన
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. -
మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి
గుజరాత్ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది.
తాజా వార్తలు (Latest News)
-
UPSC Civils 2024: ‘సివిల్స్’ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్ ఇదే..
-
Pawan Kalyan: కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
-
Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్కు ఇక ప్రత్యేకంగా
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్లో 3లక్షల కండోమ్లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు