PM modi: 1జీబీ డేటా ఒకప్పుడు ₹300.. ఇప్పుడు ₹10లకే: మోదీ
టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు 5జీ టెక్నాలజీ శ్రీకారం చుట్టబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
దిల్లీ: టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు 5జీ టెక్నాలజీ శ్రీకారం చుట్టబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో ఇది చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం సందర్భంగా శనివారం దేశంలో 5జీ సేవలు ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. 130 కోట్ల మంది భారతీయులకు టెలికాం పరిశ్రమ ఇస్తున్న బహుమానం ఇది అన్నారు. 5జీ సేవలు దేశంలో కొత్త శకానికి నాంది పలకనున్నాయని చెప్పారు.
డిజిటల్ ఇండియా అనేది నాలుగు స్తంభాలపై ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. డివైజ్ ధర, డిజిటల్ కనెక్టివిటీ, డేటా కాస్ట్, డిజిటల్ ఫస్ట్ అప్రోచ్గా వాటిని పేర్కొన్నారు. ఈ నాలుగింటిపై తాము పని చేస్తున్నామని చెప్పారు. 2014లో దేశం నుంచి ఒక్క మొబైల్ కూడా ఎగుమతి కాలేదన్న మోదీ.. ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన మొబైళ్లను ఎగుమతి చేయగలిగే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఇది మొబైల్ ధరలు తగ్గేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు. దీంతో తక్కువ ధరకే అనేక ఫీచర్లు కలిగిన ఫోన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఒకప్పుడు 1జీబీ డేటా రూ.300 ఉండేదని, ఇప్పుడు అది రూ.10లకు తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో ప్రజలు సగటున నెలకు 14 జీబీ వినియోగిస్తున్నారని, ఈ లెక్కన రూ.4,200 అవ్వాల్సిన చోట రూ.125-150 మాత్రమే అవుతోందన్నారు. ప్రభుత్వ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు చిన్న వీధి వ్యాపారి కూడా యూపీఐ సేవలను వినియోగించుకోగలుతున్నాడని మోదీ అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా ప్రయోజనాలను పొందగలుగుతున్నారని చెప్పారు. టెక్నాలజీ, టెలికాం రంగంలో జరుగుతున్న అభివృద్ధి ద్వారా పారిశ్రామిక విప్లవం 4.0కు భారత్ నాయకత్వం వహిస్తుందన్నారు. 2014లో కేవలం రెండు మొబైల్ తయారీ పరిశ్రమలే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 200కు చేరిందని ప్రధాని మోదీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!