అధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ

Published : 17 Apr 2021 19:22 IST

న్యూదిల్లీ: వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. శనివారం రాత్రి 8గంటలకు ఈ సమావేశం జరగనుంది. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించనున్నారు. రెండు రోజుల్లో మోదీ నిర్వహిస్తున్న రెండో సమావేశం కావడం గమనార్హం.

శుక్రవారం కూడా అధికారులతో మోదీ సమావేశమయ్యారు. దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభ్యతపై అధికారులతో సమీక్షించారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా... ఎప్పటికప్పుడు డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఉత్పత్తిని పెంచాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని