Joshimath: ‘జోషీమఠ్’లో పరిస్థితిపై పీఎంవో సమీక్ష.. రేపు ఉత్తరాఖండ్కు కేంద్ర బృందం!
జోషీమఠ్లో పరిస్థితిపై పీఎంవో కార్యాలయం కీలక సమీక్ష నిర్వహించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తున్నాయని.. ఇప్పటికే కొన్ని బలగాలు మోహరించినట్టు అధికారులు తెలిపారు.
దిల్లీ: ఉత్తరాఖండ్లోని జోషీమఠ్(Joshimath)లో నెలకొన్న పరిస్థితిని ఎదుర్కొనేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిపుణులు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారని పీఎంవో కార్యాలయం వెల్లడించింది. అక్కడి పరిస్థితిపై పీఎంవో కార్యాలయం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడి భూమి కుంగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని వెల్లడించారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. బోర్డర్ మేనేజ్మెంట్ కార్యదర్శి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(NDMA) సభ్యులు అక్కడి పరిస్థితిని అంచనా వేసేందుకు సోమవారం ఉత్తరాఖండ్కు వెళ్తారని పేర్కొన్నారు.
ఎన్డీఎంఏ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటీ రూర్కీ, వడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అండ్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ల నిపుణులతో కూడిన బృందం అధ్యయనం చేసి సూచనలు ఇస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పి.కె.మిశ్రా నిర్వహించిన సమావేశంలో ఉత్తరాఖండ్ సీఎస్ అక్కడి పరిస్థితిని పీఎంవోకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఎన్డీఎంఏ సభ్యులు పాల్గొన్నారు.
ఎలాంటి రిస్క్ చేయొద్దు.. ప్రజలకు సీఎస్ విజ్ఞప్తి
ఇంకోవైపు, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సుఖ్బీర్ సింగ్ సంధు ఆదివారం జోషీమఠ్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆయన వెంట డీజీపీ అశోక్ కుమార్, సీఎం కార్యదర్శి ఆర్ మీనాక్షి సుందరం తదితరులు ఉన్నారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న మనోహర్ బాగ్, సింధర్, మార్వాడీ ప్రాంతాలను పరిశీలించిన సీఎస్.. తాత్కాలిక సహాయక కేంద్రాలకు తరలివెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. నివాసితుల భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమన్నారు. అందుకోసం యంత్రాంగం నిరంతరాయంగా పనిచేస్తోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’