బీఎస్ఎఫ్ పరిధి పెంపు.. సమాఖ్య సూత్రాల ఉల్లంఘనే: పంజాబ్ అఖిలపక్షం తీర్మానం
రాష్ట్రంలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అధికార పరిధి పెంపును తిరస్కరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పంజాబ్ రాష్ట్ర అఖిలపక్షం ఆమోదించింది. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భాజపా మినహా...
చండీగఢ్: రాష్ట్రంలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అధికార పరిధి పెంపును తిరస్కరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పంజాబ్ రాష్ట్ర అఖిలపక్షం ఆమోదించింది. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భాజపా మినహా శిరోమణి అకాలీదళ్, ఆప్ తదితర అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సీఎం చన్నీతోపాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర నిర్ణయం సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించడం లాంటిదేనని సీఎం విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరినప్పటికీ.. స్పందన రాలేదని ఆరోపించారు. ఈ క్రమంలో 10-15 రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, సుప్రీం కోర్టునూ ఆశ్రయిస్తామన్నారు. దీంతోపాటు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు.
‘ముఖ్యమంత్రుల చేతులు విరిచేస్తోంది’
కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్ మధ్య సమన్వయానికి బదులుగా రాష్ట్ర పోలీసు వ్యవస్థనే దెబ్బతీస్తోందని సిద్ధూ ఆరోపించారు. రాష్ట్రంలోనే ఇంకో రాష్ట్రాన్ని సృష్టిస్తూ.. సమాఖ్య విధానాన్ని బలహీనం చేస్తోందన్నారు. ‘ఇది ఒక రాజకీయ క్రీడ. అసలు ఇందులో రాష్ట్ర అభిప్రాయాలను ఎక్కడ పరిగణనలోకి తీసుకుందని?’ అని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలకు రాజకీయ రంగు పులుముతోందని, ముఖ్యమంత్రుల చేతులను విరిచేస్తోందని ఆరోపించారు. బీఎస్ఎఫ్ పరిధి పెంపు నిర్ణయాన్ని స్వాగతించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్పై కూడ సిద్ధూ విమర్శలు చేశారు. కేంద్రం చెప్పినట్లుగా నడచుకుంటున్నారని ఆరోపించారు.
‘మా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి’
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ విషయమై స్పందించారు. సోమవారం సిలిగుడీలో మాట్లాడుతూ.. ‘పంజాబ్ మాదిరిగానే మేం కూడా కేంద్ర నిర్ణయంపై నిరసన తెలియజేస్తున్నాం. మా సరిహద్దు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పోలీసులకు సంబంధించిన విషయం. కేంద్రం తీరు కలవరం సృష్టిస్తోంది’ అని అన్నారు. పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ సిబ్బందికి ఇదివరకు సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల లోపల వరకు మాత్రమే సోదాలు, జప్తులు, అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసే అధికారాలు ఉండేవి. కానీ.. ఇటీవల ఈ పరిధిని 50 కిలోమీటర్ల వరకు పెంచుతూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..