కరోనా దెబ్బకు.. ఆ దేశాల మంత్రులు రాజీనామా!
కరోనా వైరస్ కట్టడిలో విఫలమైన ఆరోపణలతో కొన్ని దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు వారి పదవులకు రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడింది.
వైరస్ కట్టడిలో విఫలమైనందుకు బాధ్యులుగా..
ఇంటర్నెట్ డెస్క్: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు శ్రమిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాల్లో వైరస్ ఉద్ధృతిని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడిలో విఫలమైన ఆరోపణలతో కొన్ని దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు వారి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్రెజిల్లో నలుగురు..
వైరస్ కట్టడికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బ్రిజిల్లో భారీ సంఖ్యలో పౌరులు రోడ్లమీదకు వచ్చి ప్రధాని బొల్సొనారోకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ నాలుగు సార్లు ఆరోగ్యశాఖ మంత్రిని మార్చాల్సి వచ్చింది. బ్రెజిల్లోనే కాకుండా మరికొన్ని దేశాల్లోనూ కరోనా నియంత్రణలో అక్కడి ఆరోగ్యశాఖ మంత్రులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో వారి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వీరే కాకుండా స్కాట్ల్యాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో కొవిడ్ నిబంధనలు అతిక్రమించినందుకు కీలక పదవుల్లో ఉన్న నాయకులకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది.
అర్జెంటీనా..
కరోనా వైరస్ ధాటికి దక్షిణ అమెరికా దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్జెంటీనాలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 38లక్షల పాజిటివ్ కేసులు రికార్డు కాగా 78 వేల మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. క్యూలో నిలబడకుండా కొందరు రాజకీయ పలుకుబడి ఉపయోగించారనే వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి గైన్స్ గొంజాలెజ్ గర్సియా తన పదవిని వీడుతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు.
జోర్డాన్..
కరోనా కరోనా తీవ్రత కొనసాగుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో చాలా ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా జోర్డాన్లోని ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై ప్రధానమంత్రి బిషెర్ ఆల్ ఖాసవ్నేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి నాజిర్ ఒబియదత్ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ 7లక్షల కేసులు నమోదుకాగా 9వేల మంది కొవిడ్ బాధితులు కన్నుమూశారు.
పెరూ..
కరోనా వైరస్ ఉద్ధృతికి పెరూ దేశం వణికిపోయింది. అక్కడ 19 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై వివాదం మొదలయ్యింది. ఆ దేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రాకముందే పెరూ మాజీ అధ్యక్షుడు మార్టిన్ విజ్కర్రా టీకా తీసుకున్నారని తేలింది. దీన్ని వ్యాక్సిన్ స్కాండల్గా పేర్కొంటూ స్థానిక మీడియా ప్రసారం చేయడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలయ్యింది. దీంతో పెరూ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ పిలార్ మజెట్టీ తన పదవికి రాజీనామా చేశారు.
ఇరాక్..
కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఇరాక్లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ ట్యాంకు పేలిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది. ఇందుకు బాధ్యత వహిస్తూ ఇరాక్ ఆరోగ్యశాఖ మంత్రి హస్సన్ ఆన్-తమీమీ తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఇరాక్లో ఇప్పటివరకు 12లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 16వేల కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
ఆస్ట్రియా..
కరోనా కట్డడికి కృషి చేసిన ఆస్ట్రియా ఆరోగ్యశాఖ మంత్రి రుడోల్ఫ్ ఆన్షోబెర్ కూడా ఏప్రిల్ 13న తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కరోనా విజృంభణ సమయంలో అధిక సమయం పనిచేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి మరో దక్షత కలిగిన నాయకుడు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తన వైద్యులు కూడా సూచించినట్లు రుడోల్ఫ్ తెలిపారు. ఆస్ట్రియాలో ఇప్పటివరకు 6లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మరణాల సంఖ్య 10వేలు దాటింది.
ఈక్వెడార్..
కరోనా కట్టడి, వ్యాక్సిన్ పంపిణీ వ్యవహారంలో సరిగా స్పందించని కారణంగా ఈక్వెడార్ ఆరోగ్యశాఖ మంత్రి రొడొల్ఫో ఫార్ఫాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం నెల రోజుల్లోనే ఆయన ఆరోగ్యశాఖకు రాజీనామా చేశారు. ముఖ్యంగా వ్యాక్సిన్ సరఫరాలో తన సన్నిహితులకు సహాయం చేసినట్లు ఆరోపణలు రావడంతో రొడొల్ఫో తన పదవికి రాజీనామా చేశారు. ఈక్వెడార్లో ఇప్పటివరకు 4లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా 20వేల మంది మృత్యువాతపడ్డారు.
మంగోలియా..
కరోనా వైరస్ సోకిన ఓ మహిళతో పాటు చిన్నారికి చికిత్స చేసే విషయంలో ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలతో మంగోలియాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దారితీసింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటనతో కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఘటనకు తాను బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అందుచేత కేబినెట్ మొత్తం రద్దు చేస్తున్నట్లు మంగోలియన్ ప్రధానమంత్రి ఖురేల్సుఖ్ ఉఖ్నా ప్రకటించారు. అప్పుడే జన్మనిచ్చిన తల్లిని మరోచోటుకి తరలించడంలో తప్పు జరిగిందని ప్రధాని అంగీకరించారు.
స్లొవాకియా..
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో స్లొవాకియా ప్రభుత్వం విఫలమయ్యిందని అక్కడి విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా వైరస్ కట్టడితోపాటు రష్యా వ్యాక్సిన్ సుత్నిక్-వి విషయంలోనూ ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇలా కరోనా నియంత్రణలో విఫలం కావడంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నెలలో స్లొవాకియా ఆరోగ్యశాఖ మంత్రి మారెక్ క్రాజి తన పదవికి రాజీనామా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్