CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!
దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంలో సీబీఐ దాడులు.. భాజపా, ఆప్ మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి.
దిల్లీ: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంలో సీబీఐ దాడులు.. భాజపా, ఆప్ మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. మంచి పనులకు లభించిన ప్రతిఫలమిదంటూ ఆప్ కన్వీనర్ సిసోదియాకు మద్దతిస్తూ కేజ్రీవాల్ భాజపాపై విమర్శలు చేయగా.. కాషాయ పార్టీ తనదైన శైలిలో వాటిని తిప్పికొట్టింది. నూతన అబ్కారీ విధానంలో అవకతవకల గురించి తన నేతపై కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
భాజపా ఎంపీ ప్రవేశ్ వర్మ మాట్లాడుతూ.. ‘అరవింద్ కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చి ఉండొచ్చు. సిసోదియా, సత్యేందర్ జైన్కు పెరుగుతోన్న ప్రజాదరణ ఆయనలో భయాన్ని కలిగించి ఉండొచ్చు. వారిని పక్కకు తప్పించాలని భావించి ఉండొచ్చు. కేజ్రీవాల్ అనుమతి లేకుండా వారు చిన్న బ్రేక్ కూడా తీసుకోరు. కానీ, ఇప్పుడు జైన్ మూడు నెలల నుంచి జైల్లో ఉన్నారు. సిసోదియాపై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. ఇంక కేజ్రీవాల్ మాత్రం ఎంతకాలం స్వేచ్ఛగా ఉండగలరు? ఆప్లో మొత్తం వ్యవహారం నడిపించేది కేజ్రీవాలే. తనవద్ద ఏ శాఖ ఉండకపోవడంతో దేనిపై ఆయన సంతకాలు చేయరు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం.. తన నిజాయతీని చూపించుకునేందుకు తన మంత్రులను జైలుకు పంపుతారు’ అంటూ ఆప్కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్శాఖకు ఇన్ఛార్జ్గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తులో భాగంగా నేడు సోదాలు చేపట్టింది. సిసోదియా నివాసం, కార్యాలయంతో పాటు మాజీ ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ తదితరుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించింది.
అప్పుడు మఫ్లర్లు.. ఇప్పుడు పెన్సిళ్లు: ఆప్
సీబీఐ దాడులపై ఆప్ ప్రతినిధి రాఘవ చద్దా మాట్లాడుతూ.. ‘గతంలో ఆప్ నేతల ప్రాంగణాల్లోనూ సోదాలు జరిగాయి. కేజ్రీవాల్కు సంబంధించిన పరిసరాల్లో మఫ్లర్లు దొరికాయి. సిసోదియా ఇంట్లో పెన్సిళ్లు, నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు దొరుకుతాయి. వారు సిసోదియా అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు’ అంటూ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి