Kejriwal: మోదీజీ.. 14వేలు కాదు.. 10లక్షల పాఠశాలలను నవీకరించండి..!
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను నవీకరించేందుకు ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి
దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను నవీకరించేందుకు ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆయన.. తద్వారా రానున్న ఐదేళ్లలో దేశంలోని 10లక్షల పాఠశాలలను ఆధునీకరించాలన్నారు. పీఎం-శ్రీ యోజన (PM SHRI Yojana) కింద దేశంలోని 14,500 పాఠశాలల్లో ల్యాబ్లు, స్మార్ట్ క్లాస్రూమ్ల వంటి ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ విధంగా మాట్లాడారు.
‘14,500 పాఠశాలలను ఆధునీకరిస్తామని ప్రధాని మోదీ (Narendra Modi) ప్రకటించడం మంచి విషయం. అయితే, ఈ సంఖ్య సముద్రంలో నీటి బిందువులాంటిది. ఈ లెక్కన దేశంలో ఉన్న 10.5లక్షల పాఠశాలలను అభివృద్ధి చేయాలంటే మరో 70-80ఏళ్లు పడుతుంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న పదిన్నర లక్షల ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్రాల భాగస్వామ్యంతో నవీకరించేందుకు ఓ ప్రణాళిక రూపొందించండి’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన, ఉచిత విద్య (Quality Education) అందించనంతవరకు ప్రపంచంలో భారత్ నంబర్ 1 దేశం కాలేదన్నారు. భారత్ స్వాతంత్య్రం పొందిన తర్వాత చాలా పెద్ద తప్పిదం జరిగిందన్న ఆయన.. దేశంలో ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సింది అన్నారు. ప్రతిఒక్కరూ విద్యావంతులైతే భారత్ పేద దేశంగా ఉండేది కాదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకుల వల్లే భారత్ అభివృద్ధి చెందలేదని ఆరోపించిన కేజ్రీవాల్.. ప్రజలు ఏకమై ఒక కుటుంబంగా, బృందంగా పనిచేస్తే తప్ప మార్పు రాదన్నారు. ఒకవేళ ప్రజలే ఏకమైతే ప్రపంచంలోనే నంబర్ 1గా ఎదగడంలో భారత్ను ఏ శక్తి కూడా ఆపలేదని ఉద్ఘాటించారు. భారత్ను ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మార్చే లక్ష్యంతో ఆమ్ఆద్మీపార్టీ ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఇందులో భాగంగా హరియాణాలోని హిసార్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి.. తర్వాత అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు