Vice chancellor: 12 సెంట్రల్ యూనివర్సిటీలకు కొత్త వీసీలు
దేశంలోని 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కొత్త వీసీల జాబితాను విడుదల.....
దిల్లీ: దేశంలోని 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కొత్త వీసీల జాబితాను విడుదల చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా డాక్టర్ బీజే రావు నియమితులు కాగా.. మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ సయ్యద్ అన్యుల్ హసన్కు అవకాశం లభించింది. అలాగే, హరియాణా సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ టంకేశ్వర్ కుమార్, హిమాచల్ప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ సత్ప్రకాశ్ బన్సల్, జమ్మూ సెంట్రల్ వర్శిటీకి డాక్టర్ సంజీవ్ జైన్, ఝార్ఖండ్ సెంట్రల్ వర్సిటీకి ప్రొఫెసర్ క్షితిభూషణ్ దాస్, కర్ణాటక సెంట్రల్ వర్సిటీకి ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ, తమిళనాడు సెంట్రల్ వర్సిటీకి ప్రొఫెసర్ ముత్తుకళింగన్ కృష్ణన్, దక్షిణ బిహార్ సెంట్రల్ వర్సిటీకి ప్రొఫెసర్ కామేశ్వర్ నాథ్ సింగ్, నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ ప్రభ శంకర్ శుక్లా, గురు ఝాసిందాస్ యూనివర్సిటీకి డాక్టర్ అలోక్ కుమార్ ఛక్రవాల్, మణిపూర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ ఎన్.లోకేంద్ర సింగ్లను నియమించారు.
దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 22 వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వీటిలో 12 ఖాళీల భర్తీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాజ్యసభకు తెలిపారు.
హెచ్సీయూ కొత్త వీసీగా నియమితులైన ప్రొఫెసర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు (బీజే రావు) ప్రస్తుతం తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిలో జీవశాస్త్రం విభాగాధిపతిగా ఉన్నారు. నిజాం కాలేజీలో బీఎస్సీ, ఓయూలో ఎమ్మెస్సీ, బెంగళూరులోని ఐఐఎస్లో పీహెచ్ డీ చేశారు. హెచ్సీయూ వీసీగా బీజే రావు ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. అలాగే, ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులు కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం