కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పల్స్ పోలియో
2021 సంవత్సరానికి గాను పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు.
ప్రారంభించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
దిల్లీ: పోలియో రహిత భారతదేశాన్ని సాధించే లక్ష్యంలో భాగంగా నేడు ‘జాతీయ పోలియో నిరోధక దినోత్సవాన్ని’ (నేషనల్ పోలియో ఇమ్మ్యునైజేషన్ డే) పాటిస్తున్నారు. పల్స్ పోలియో-2021 కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. దీనిలో భాగంగా రాష్ట్రపతి భవన్లో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలను వేశారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ సవితా కోవింద్, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్ష్వర్ధన్ తదితరులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని, నిర్దేశిత కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు వైద్యారోగ్య సిబ్బంది, తల్లితండ్రులకు కూడా మాస్కులు, సామాజిక దూరం, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరి అని వివరించారు.
17కోట్ల చిన్నారులకు రక్షణ
ఈ సంవత్సరం పోలియో నిరోధక దినోత్సవాన్ని దేశంలో జనవరి 31న పాటిస్తున్నారు. ‘పోలియో ఆదివారం’ అనే ఈ కార్యక్రమంలో భాగంగా అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో టీకాను ఉచితంగా అందచేస్తారు. ఈ సంవత్సరం సుమారు 17 కోట్ల మంది చిన్నారులకు పోలియో నుంచి రక్షణ కల్పించటమే లక్ష్యమని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో 24 లక్షల మంది వాలెంటీర్లు, 1.5 లక్షల సూపర్వైజర్లు పాల్గోనున్నారు. వీరు దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా గృహాలను సందర్శించి.. ప్రతి ఒక్క చిన్నారికీ పోలియో టీకా రక్షణ అందేలా జాగ్రత్త తీసుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస అనుబంధ సంస్థ యూనిసెఫ్, రోటరీ ఫౌండేషన్ తదితర పలు సామాజిక, సేవా సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
ఐనా అప్రమత్తత తప్పనిసరి
కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభానికి ముందు అంతర్జాతీయ పోలియో కేసుల్లో 60 శాతం భారత్లోనే ఉండేవని.. దశాబ్ద కాలంగా మన దేశం పోలియో రహితం ప్రాంతంగా మారిందని వివరించారు. దేశంలో ఆఖరి పోలియో కేసు జనవరి 13, 2011న పశ్చిమ బెంగాల్లోని హౌరాలో నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యారోగ్య సిబ్బంది, అధికారుల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. అయినప్పటికీ.. కొన్ని పొరుగు దేశాలతో సహా, ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఇంకా పోలియో వ్యాపిస్తుండటంతో మనం అప్రమత్తంగానే ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..
ఈ దశాబ్దం భారత్కు కీలకం.. మోదీ
97 శాతానికి కొవిడ్ రికవరీ రేటు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్