కర్ణాటక నుంచి మదనపల్లె రానున్న రాష్ట్రపతి

ఈ నెల 7న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో...

Updated : 03 Feb 2021 20:21 IST

పర్యటన వివరాలు వెల్లడించిన రాష్ట్రపతి భవన్‌ 

దిల్లీ: ఈ నెల 7న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని సత్సంగ్‌ ఫౌండేషన్‌ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అలాగే, సదుంలోని ‘పీపల్‌ గ్రోవ్‌’‌ పాఠశాలకు వెళ్లనున్నారు. ఈ నెల 4 నుంచి 7 తేదీల వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తారని పేర్కొంటూ రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రేపు సాయంత్రం (గురువారం) దిల్లీ నుంచి బయల్దేరనున్న రాష్ట్రపతి కోవింద్‌ బెంగళూరు చేరుకుంటారు. ఫిబ్రవరి 5న యలహంకలో జరుగుతున్న ఎయిరో ఇండియా-2021 కార్యక్రమంలో ప్రసంగిస్తారు. 6వ తేదీన  కొడగు జిల్లాలో పర్యటించనున్న కోవింద్‌.. జనరల్‌ తిమ్మయ్య పూర్వీకుల ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. 7న బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం ఏపీలో అదేరోజు పర్యటన పూర్తిచేసుకొని దిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏపీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. 

ఇదీ చదవండి..

కన్నీళ్లు పెట్టుకున్నారు.. కాదనలేకపోతున్నా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని